DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ దేవాలయాల ఫిక్సడ్ డిపాజిట్లు కొల్లగొట్టడంపై విహెచ్పి ధర్నా, హెచ్చరిక

*ప్రభుత్వం హిందు గుళ్ల నుంచి దోచుకుంటోంది, ఇతరులకు పంచిపెడుతోంది:*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 17, 2022 (డిఎన్ఎస్):* 

ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖా దేవాలయాల ఫిక్సడ్ డిపాజిట్ల విడుదల ఇతరత్రా ఖర్చులకు వాడుకోడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ శాఖా

మండిపడింది. ఆదివారం విజయవాడలోని విహెచ్పి ప్రధాన కేంద్రం వద్ద రాష్ట్ర కమిటీ నిరసన చేసింది. దీనిలో దేవాదాయ శాఖను హెచ్చరించింది. తక్షణం ఈ జీవో ను వెనక్కి తీసుకోవాలని, భక్తులు గుళ్లకు ఇచ్చిన విరాళాలను దేవాలయాలు వేరే విధంగా ఖర్చు చేయడం పై మండిపడింది. కొరోనా కారణంగా గత రెండేళ్లుగా దేవాలయాలు ఆదాయం లేక ఇబ్బందులు

పడుతుంటే బకాయిల పేరుతొ వేధించడాన్ని తప్పుపట్టింది.  

EAF - CGF - ANF - Audit మొత్తం అడిట్ ఫీజు రూ. 355 కోట్ల 80 లక్షలు బకాయిలను పేరుతొ గుళ్ల నుంచి వసూళ్లకు దేవాదాయ శాఖా బాదుడు సిద్దపడుతోందన్నారు. దీనికోసం సర్వీస్ లెస్ ఫిక్స్ డ్ డిపాజిట్లు వెంటనే రద్దు చేసి ఆ మొత్తాలను వీటికి జమ చెయ్యాలని కమిషనర్ ఆదేశించడంపై విహేపి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

ఇప్పడికే రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పట్ల అణిచివేత ధోరణి ప్రదర్శిస్తోందని, మండిపడ్డారు. 

కామన్ గుడ్ ఫండ్ - సర్వ సర్వశ్రేయోనిధి.

ఇది సర్వులకు శ్రేయస్సుకరమైన నిధే కానీ, హిందూ శ్రేయో నిధి కాదన్నారు. హిందువుల

గుళ్ల నుంచి డబ్బులు బలవంతంగా వసూళ్లు చేసి హిందువుల గుళ్లను గుల్ల చేస్తున్నారన్నారు. మరోప్రక్క ప్రభుత్వం సంక్షేమం పేరిట చర్చ్ పాస్టర్లకు, ముస్లిం ముల్లాలకు, లక్షలాదిగా డబ్బులు దోచిపెడుతోందన్నారు. దేవాదాయ శాఖా చరిత్రలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయినా రాష్ట్రంలోనే ఏ దేవాలయానికైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని

ప్రశ్నించారు. హిందువులకు ఇచ్చిన నిధులెన్ని? ఇతరులకు ఇచ్చిన నిధులెన్ని ? దీనిపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు. 

హిందూ దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. సామాన్యులు గుడి లోని హుండీ ల్లో వేసే ముడుపులు దోచుకుని, ఇతరులకు పంచిపెట్టడాన్ని విహెచ్పి ఖండిస్తోందన్నారు. హుండీ డబ్బులు

ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి? హిందూ గుళ్ళు కూలుస్తున్నందుకా? అర్చకులను చంపుతున్నందుకా? దేవాలయ భూములు పాలకులు అమ్మెస్తున్నందుకా? అన్యమతస్తులను దేవాదాయ శాఖా నుంచి తొలగించనందుకా? భక్తులపై దౌర్జన్యం కేసులు పెడుతున్నందుకా? ఈ సిజిఎఫ్ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేసారు. 
తక్షణం దేవాదాయ శాఖా

కమిషనర్ తన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధపడాలని హెచ్చరించారు. ఈ నిరసనల్లో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ, విజయవాడ, కృష్ణ జిల్లాల కమిటీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam