DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తల ఎత్తుకునే ప్రచారానికి వెళ్తాం: బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు 

విశాఖపట్నం, ఆగస్టు 13, 2018 (DNS  Online ) : రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తల ఎత్తుకునే ప్రచారానికి వెళ్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తెలిపారు.

ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన అయన సోమవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయం లో బీజేపీ ఇచ్చిన అన్ని

ప్రధాన హామీలను నెరవేర్చిన తర్వాతే  à°Žà°¨à±à°¨à°¿à°•à°² ప్రచారానికి వస్తుందన్నారు. అతి త్వరలోనే విశాఖపట్నం కేంద్రం à°—à°¾ రైల్వే జోన్ ప్రకటన కూడా వింటారని చూచాయగా

తెలియచేసారు. ఈ రాష్ట్రం లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రింద స్థాయి నుంచి పై స్థాయి వరకూ అంతా అనివీతి లో కూరుకు పోయారన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో

అభివృద్ధి విస్తృతంగా జరగవలసి ఉండగా, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యవం లో చేస్తున్న అవినీతి కారణంగా అభివృద్ధి పాతాళానికి పడిపోయిందన్నారు. దేశం లో కాంగ్రెస్

పాలనకు విసిగిపోయిన ప్రజలు, నేతల సారధ్యంలో ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ఆలా ఏర్పడిన పార్టీ తెలుగుదేశం అని, అయితే ఇప్పుడు

చంద్రబాబు కుతంత్రం, స్వార్ధం వల్ల అదే కాంగ్రెస్ కు అంతర్గతంగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. పలు జాతీయ అంశాలపై వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం లో

విశాఖపట్నం లోక్ సభ సభ్యులు డాక్టర్ కె. హరిబాబు, విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం శాసన సభ్యులు పి విష్ణుకుమార్ రాజు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ

పివిఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యాల రావు, విశాఖపట్నం నగర బీజేపీ అధ్యక్షులు ఎమ్, నాగేంద్ర, సీనియర్ నేతలు చెరువు రామకోటయ్య, రాష్ట్ర అధికార

ప్రతినిధి సుహాసిని ఆనంద్, తదితర్లు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam