DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్ర సహకారం - రాష్ట్ర పార్టీల అసత్య ప్రచారం పై బీజేపీ పుస్తకం విడుదల 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం/ ఢిల్లీ , జులై 20, 2022 (డిఎన్ఎస్):* కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు అందించిన ఆర్థిక సహకారం, రాష్ట్రంలోని పార్టీలు చేస్తున్న అబద్దపు అసత్య ప్రచారం ను పుస్తకంగా ముద్రించి విడుదల చేసినట్టు రాజ్యసభ

సభ్యుడు జి వీల్ ఎల్ నర్సింహారావు తెలిపారు. బుధవారం 
ఢిల్లీ లో  నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ గత 8 సంవత్సరాలలో నరేంద్ర మోడీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ  (కేంద్ర ) ప్రభుత్వం ఈ దేశంలోని రాష్ట్రాలకు అందించిన పూర్తి సహకారాన్ని తెలియచేస్తూ, రాష్ట్రాలు చేస్తున్న అబద్దపు అసత్య ప్రచారాన్ని

ఎండగడుతూ ఈ పుస్తకంలో ఆధారాలతో ముద్రించడం జరిగిందన్నారు. ఈ పుస్తకాన్ని బీజేపీ కేంద్ర అధ్యక్షులు జెపి నడ్డా విడుదల చేశారన్నారు. 2014 నుంచి 2022 వరకూ  జరిగిన అన్ని అసత్యపు ప్రచారాలను దీనిలో వివరించామన్నారు. మొత్తం  98 పేజీలతో పూర్తి వివరాలు పొందుపరిచామన్నారు. 
 
2014 నుంచి నేటి వరకూ పరిపాలనలో ఉన్న పార్టీల వైఖరి

బహిర్గతం చేశారు. చంద్రబాబు నాయుడు,  నేటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాలు మాటలు మార్చిన అంశాలను పుస్తకం ద్వారా ఎండగట్టారు.  

2015  చంద్రబాబు ఒక  దినపత్రికలో ప్రకటన . .. హోదా సంజీవని కాదు,  హోదా వేరు, పరిశ్రమల రాయితీ లు వేరు.. .రెండింటిని పోల్చడం సరి కాదు. ఇంతవరకూ ఇచ్చిన సాయం పై ధన్యవాదాలు. మిగిలిన vaatipai

కేంద్రాన్ని కోరతాం అంటూ  ప్రకటించారన్నారు. 

2017  జనవరి లో  అసెంబ్లీ లో  14 వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదాని తిరస్కరించింది. ప్యాకెజీ కి ఆమోదం ఇచ్చింది రాష్ట్ర ప్రజ్  ప్రయోజనాలకోసం అంటూ చంద్రబాబు చెప్పారు. ఆనాడు ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  జీర్ణించుకోలేక పోతున్నారు అంటూ

దుయ్యబట్టారన్నారు. 

2017 లో వెలగపూడి సచివాలయం లో హోదా కు రాయితీలకు సంబంధం లేదు. హోదా వస్తే 100 శతం పారిశ్రామిక రాయితీ వస్తుందని ఏ జీవోలో ఉందొ చూపించాలి అని నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారన్నారు.

అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఇచ్చిన సహకారం ద్వారా వచ్చిన అన్ని

ప్రాజెక్ట్ లపై ప్రధాని బొమ్మ ను తొలగించి, ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోవడం, కేంద్ర పథకాల  పేర్లు మార్చి సొంత పేర్లు పెట్టడం vanti ఈ పుస్తకంలో పొందుపరిచామన్నారు.

ఈ పుస్తకం గురువారం మీడియా ప్రతినిధులకు, ఏ ఇతర రాష్ట్రాల ఎంపీలకు అందరికి పంపిణీ చేస్తామన్నారు. 

దీనితో పాటు నాడు ఈ పార్టీల అధ్యక్షులు,

నాయకులూ, అందరూ మాట్లాడిన నాటి వీడియోలను కూడా విడుదల చేస్తామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam