DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కామన్ వెల్థ్ గేమ్స్ 2002 క్రీడాకారులతో ప్రధాని మోడీ భేటీ 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 20, 2022 (డిఎన్ఎస్):* జులై నెల 28వ తేదీ మొదలుకొని ఆగస్టు నెల 8వ తేదీ వరకు బర్మింగ్ హమ్ లో జరుగనున్న కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో పాల్గొనే  భారతదేశం జట్టు సభ్యులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.  బుధవారం వీడియో ద్వారా భేటీ ayyaru. ఈ సందర్బంగా మాట్లాడుతూ

‘ప్రస్తుతం, మీ వంటి క్రీడాకారుల లో ఉత్సాహం అధికం గా ఉంది;  శిక్షణ కూడా మెరుగు పడుతున్నదని, క్రీడలంటే దేశం లో వాతావరణం సైతం బ్రహ్మాండం గా ఉందన్నారు. లక్ష్యమల్లా మువ్వన్నెల పతాకాన్ని ఉన్నతం గా ఎగిరేటట్లు చూడడమూ, జాతీయ గీతం యొక్క ఆలాపన జరుగుతూ ఉంటే దానినిఆలకించడమూ ను అన్నారు. 

మహారాష్ట్ర క్రీడాకారుడు శ్రీ

అవినాశ్ సాబ్ లే  సియాచిన్ లో భారతీయ సైన్యం లో పని చేసారు. భారతీయ సైన్యం నుంచి తాను పొందిన శిక్షణ, తాను అలవరచుకున్న క్రమశిక్షణ లతో తాను ఏ రంగం లో అడుగిడినప్పటికీ కూడాను అందులో రాణించడాని కి తన కు తోడ్పడుతాయి అని ఆయన అన్నారు. 

పశ్చిమ బంగాల్ కు చెందిన శ్రీ అచింత శులీ 73 కిలో గ్రాముల కేటగిరి లో పాల్గొనే ఒక వెయిట్

లిఫ్టర్, కేరళ కు చెందిన బాడ్ మింటన్ క్రీడాకారిణి ట్రీసా జాలీ, ఝార్ ఖండ్ కు చెందిన హాకీ క్రీడాకారిణి సలీమా టేటే, షాట్ పుట్ విభాగం లో పారా ఎథ్ లీట్, హరియాణా కు చెందిన శర్మిల, అండమాన్- నికోబార్ కు చెంది ఒక సైకిలిస్టు డేవిడ్ బెక్ హమ్ తదితరులు పాల్గొన్నారు. 

 ఈ పోటీల్లో మొత్తం 215 మంది క్రీడాకారులు, క్రీడాకారిణులు 19

క్రీడావిభాగాల లో 141 ఈవెంట్స్ లో పాల్గొని, భారతదేశాని కి ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి అటు క్రీడాకారులు / క్రీడాకారిణులు, ఇటు వారి కోచ్ లు కూడా హాజరు అయ్యారు. యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచారం- ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ తో పాటు క్రీడల కార్యదర్శి కూడా ఈ కార్యక్రమం లో

పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam