DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భగవంతుని పై భక్తి లో చిత్తశుద్ధి ఉండాలి :దేవనాథ జీయర్ స్వామి

*ఈ నెల 29 నుంచి ఆగస్టు 26 వరకూ వారిజ ఆశ్రమం లో శ్రీ యాగం* 

*వేంకటాద్రి ఆలయంలో దేవనాథ జీయర్ స్వామి ప్రత్యేక ఆరాధనలు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 23, 2022 (డిఎన్ఎస్):* ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఆరాధన చేసినా, దేవాలయాల్లోని ఆరాధనలో పాల్గొన్నా భగవంతుని పై ఉన్న భక్తి

లో చిత్తశుద్ధి ఉండాలని త్రిదండి దేవనాథ జీయర్ స్వామి పిలుపు ఇచ్చారు. శనివారం విశాఖ పట్నం నగర శివారు ప్రాంతమైన పెందుర్తి కొండపై గల వేంకటాద్రి దేవాలయాన్ని స్వామి దర్శించారు. ఈ సందర్బంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ సనాతన హిందూ  సంప్రదాయంలో ఆరాధన ప్రధానమైనదని, ఇళ్లల్లోను, దేవాలయాల్లో గానీ స్వామిని ఆరాధించే

భక్తి లో చిత్తశుద్ధి ఉండాలన్నారు. కష్ట, సుఖాల కలయికే ఈ  జీవితం అని, చిన్న కష్టం వచ్చిందని, నిత్యం ఆరాధించే దేవుణ్ణి మార్చడం, లేదా మతం మారడం లాంటివి సరైన చర్యలు కాదన్నారు. చిత్తశుద్ధితో చేసే భక్తి అత్యుత్తమ ఫలితాలు ఇస్తుందన్నారు. వారానికొక సారి మారు ఆలయాలకు వెళ్లడం వలన  అక్కడ పెద్దల ద్వారా జరిగే సత్సంగం లో

పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు.  తమకు కల్గిన కష్టాన్ని సునాయాసంగా  అధిగమించేందుకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. 

తమ ఆచార్యులు త్రిదండి  చిన్న జెఈయర్ స్వామి వారి ఆదేశాల మేరకు తాము చాతుర్మాస్య దీక్ష ను విశాఖ  సాగర తీరంలోని వారిజ ఆశ్రమంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీక్షలో భాగంగా తాము నగర

పరిధిలోని  దేవాలయాలు, విద్యాలయాలు సందర్శిస్తున్నామని, సమాజంలో జరుగుతున్నా అంతరాల పట్ల  విద్యార్థుల్లో అవగాహనా పెంచి, దేశ భక్తి పెంపొందించే విధంగా వారిలో అవగాహనా పెంచడం ద్వారా విద్యార్థులు ఉత్తమ  పౌరులుగా తీర్చిదిద్దబడతారన్నారు.

*ఈ నెల 29 నుంచి వారిజ ఆశ్రమం లో శ్రీ యాగం :

శ్రావణ మాసాన్ని

పురస్కరించుకుని ఈ నెల 29 నుంచి వారిజ ఆశ్రమం లో శ్రీ యాగం వైభవంగా నిర్వహించేందుకు ఆశ్రమ వేదపండితులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ యాగం ఆగస్టు 26
వరకూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హోమ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని అని ఆహ్వానించారు. 

సమాజ

సేవ, శ్రేయస్సుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే చిన్న జీయర్ స్వామి వారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక బృహత్తరమైన వరాన్ని అనుగ్రహించారన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి సమీపంలో వనమూలికలు, ఔషధ సంపద ఉన్న సుమారు 205 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక, ఆయుర్వేద వైద్యశాల, మేనేజ్మెంట్ యూనివర్సిటీ వంటి విద్య,

వైద్య సంస్థలను నిర్మించనున్నారన్నారు. ఈ ప్రాంతం  వారికి అత్యుత్తమ ఆయుర్వేద వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారన్నారు.  విస్తృతంగా వైశ్య శిబిరాలు  నిర్వహించడం, ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం ఆయుర్వేదం ద్వారా  అందించే అవకాశం ఉందన్నారు. 

అంతకు ముందు ఆలయ

అర్చక సిబ్బంది స్వామిజి కి పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో శ్రీవెంకటేశ్వరస్వామికి దేవనాథ జీయర్ స్వామి వారు ప్రత్యేక అర్చన చేసి, స్వామికి ఇచ్చిన హారతి ఇచ్చారు. కార్యక్రమంలో స్వామి వారితో పాటు వారిజ ఆశ్రమ వేదపండితులు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam