DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసిన రోజుది: దేవనాథ జీయర్ స్వామి

*కార్గిల్ వీరుల కుటుంబాలకు అండగా ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి*

*1999 నాటి విజయం కోసం మంగళ తరంగిణి, వీరుల కోసం అమర సేవతరంగిణి*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 26, 2022 (డిఎన్ఎస్):* భారత దేశ సైనిక శక్తి అకుంఠిత దీక్ష, కార్యదక్షత  జులై  26, 1999 లడక్ సమీపంలోని

కార్గిల్ యుద్ధం లో విజయం ద్వారా ప్రపంచానికి తెలిసిన రోజు అని పరమహంస పరివ్రాజకులు త్రిదండి దేవనాథ జీయర్ స్వామి తెలియచేసారు. కార్గిల్ విజయోత్సవ దివస్ ను పురస్కరించుకుని మంగళవారం భారత సైనికులకు ఆయన శుభాకాంక్షలు తెలియచేసారు. విశాఖ సాగర  తీరంలోని వారిజ ఆశ్రమంలో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న జీయర్ స్వామి 1999

నాటి కార్గిల్ యుద్ధం సమయంలో చిన్న జీయర్ స్వామి వారు చేపట్టిన కార్యాచరణ ను వివరించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ముందుగా దేశభక్తి కల్గి యుండాలని, ఆ తర్వాతే స్వీయ ధర్మం పాటించాలన్నారు. 

కార్గిల్ పర్వత ప్రాంతాలను పాకిస్తాన్ సైన్యం,. తీవ్రవాదులు, ఉగ్రవాదుల ఆక్రమించి, భారత భూ భాగంలోకి రావడంతో భారత భూ భాగాన్ని

కాపాడుకోవడం కోసం సైనికులు పోరాటం చేసి, విజయం సాధించారన్నారు. 

చిన్న జీయర్ స్వామి కేవలం ఆధ్యాత్మిక ప్రచారం మాత్రమే చెయ్యడం కాకుండా, సమాజ సేవలో భాగంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన ప్రతి సారీ వాలంటీర్లు, వేదం విద్యార్థులు సైతం సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవుతారన్నారు. కోనసీమ ఉప్పెన వచ్చిన సమయంలోను, గుజరాత్

లో భూకంపం వచ్చినప్పుడు బాధిత కుటుంబాలకు ఇల్లు నిర్మించి ఇచ్చారన్నారు. అదే విధంగా ప్రస్తుతం వచ్చిన తుఫాన్ల బాధితుల కోసం ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నారన్నారు. 

అదే విధంగా 1999 లో కార్గిల్ యుద్ధ సమయంలో సైనికుల విజయం కోసం మంగళ తరంగిణి, వీరుల కుటుంబాల కోసం  అమర సేవతరంగిణి కార్యక్రమాలను చిన్న

జీయర్ స్వామి వారు నిర్వహించారన్నారు. 

మంగళ తరంగిణి :.

యుద్ధ సమయంలో సైనికులకు మనో బలం అందించేలా భాగ్య నగరం లోని జింఖానా మైదానంలో మంగళ తరంగిణి నిర్వహించామన్నారు. సుమారు లక్షమంది భక్తులతో సైనికులకు మనోధైర్యం లభించాలి అని శ్రీ విష్ణుసహస్ర నామ స్తోత్ర పారాయణ, అనంతరం దీపోత్సవం నిర్వహించామన్నారు. ఈ

సందర్బం గా సైనికులకు శిబిరాల్లో చికిత్స పొందుతున్న సైనికులకు రక్త నిల్వలు అవసరం పడితే అందించేందుకు రక్తదాన శిబిరాలు నిర్వహించి, రక్త యూనిట్లు అందించాలని పిలుపు నిచ్చారన్నారు. స్వామిజి పిలుపు కు స్పందించిన యువత పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరాలు నిర్వహించారన్నారు.

అమర సేవా తరంగిణి :.

సైనికులు

చేసిన పోరాట స్ఫూర్తి శక్తి ఫలితంగా 1999 జులై 26  లో భారత సైనికులు కార్గిల్ విజయోత్సవ వేడుకలు జరుపుకున్నాం అన్నారు. అయితే ఈ క్రమంలో ఎందరో సైనిక వీరులు ఈ యుద్ధంలో వీరోచితంగా పోరాడి అమరులవ్వడం చాల బాధాకరం అన్నారు. అయితే అమర వీరులు అందరికి నివాళి అందించడమే కాక, వీరి కుటుంబాలకు తమ వంతు సహకారం అందించాలి అని అమర సేవా తరంగిణి

కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమం  ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 50 వేలు చొప్పున చిన్న జీయర్ స్వామి వారి ట్రస్ట్ తరపున అందించారన్నారు.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam