DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాఫీ మాంగో సోనియా. . లోక్ సభలో సోనియా పై శివాలెత్తిన స్మృతి ఇరానీ. 

*సామాన్యులు రాష్ట్రపతి గా ఎన్నికవ్వడం కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది :బీజేపీ*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 29, 2022 (డిఎన్ఎస్):* మాఫీ మాంగో సోనియా గాంధీ అంటూ గురువారం భారత లోక్ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శివాలెత్తిన ఘటన ప్రపంచదేశాలతో సైతం సంచలనంగా మారింది.  సోనియా

పై విరుచుకు పడ్డారు. వివరాల్లోకి వెళితే. .

భారత దేశ ప్రథమ పౌరులు స్థానంలో ఎవరు ఉన్నా వారిని గౌరవించవలసిన భాద్యత ప్రతి ఒక్క భారతీయుని పై ఉంది. అయితే అధికారం కోల్పోవడంతో పాటు, ప్రజల్లో విశ్వాసం పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక పోతోంది. ఈ విషయం బహిరంగంగానే ఆ పార్టీ ఎంపీలు,

ఎమ్మెల్యేలు, నేతలు బయటపెడుతున్నారు. దీనికి నిదర్శనమే భారత రాష్ట్రపతి పై కాంగ్రెస్ ఎంపీ చౌదరి చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ రెండు సభలూ దద్దరిల్లిపోతున్నాయి.

ఈమె ఎన్నికల ప్రచారం సమయంలో అవహేళనగా వ్యాఖ్యలు చెయ్యడమే కాకుండా, ఆమె ఎన్నికై, పదవి ప్రమాణం చేసిన తర్వాత బుధవారం బహిరంగం చేసిన అవమానకర వ్యాఖ్యలు దేశ

ప్రజలు సహించడం లేదు. ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గురువారం లోక్ సభలో శివాలెత్తిపోయారు.  

భారత దేశ అత్యున్నత వ్యక్తి ని ఎలా గౌరవించాలో కూడా తమ సభ్యులకు తెలియచెయ్యని కాంగ్రెస్ అధ్యక్షురాలు, లోక్ సభలో కాంగ్రెస్ నేత సోనియా గాంధి భాద్యత వహించాలని బీజేపీ మండిపడింది. తక్షణం దేశ

ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలని, దేశ ప్రధానికి క్షమాపణ చెప్పాలని, గిరిజన వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ పెరిగిపోయింది. 

శుక్రవారం సంసద్ సే సడక్ తక్ అనే నినాదం తో భారతీయ జనతాపార్టీ రోడ్లపై భారీ నిరసనలు చేసే అవకాశం ఉంది.  గురువారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ నేతలు సోనియా, కాంగ్రెస్

క్షమాపణ చెప్పాలంటూ నిరసనలు తెలిపారు. శుక్రవారం అవి మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam