DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమైక్య స్ఫూర్తిగా యువతలో దేశభక్తి పెంపొందించండి: దేవనాథ జీయర్ స్వామి

*సమైక్య ఉద్యమ నేత ఆడారి కి జీయర్ స్వామి ఆశీర్వచన పూర్వక అభినందనలు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  02, 2022 (డిఎన్ఎస్):* సమైక్య ఉద్యమ సమయంలో ఎందరిలోనో చైతన్యం కల్గించారని, అదే స్ఫూర్తిగా నేడు యువతలో దేశ భక్తి ని పెంపొంచే కార్యక్రమాలను నిర్వహించాలని పరమహంస

పరివ్రాజకులు, ఆధ్యాత్మిక వేత్త త్రిదండి దేవనాధా జీయర్ స్వామి పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖపట్నం - భీమిలి బీచ్ రోడ్ లోని వారిజ ఆశ్రమం ( చిన్న జీయర్ స్వామి వారి వేదపాఠశాల) లో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న దేవనాధా జీయర్ స్వామి ని ఆడారి కిషోర్ దర్శించుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాలతో పాటు, సామాజిక పరమైన అందాలపై

ఉద్యమాలు చేయడంతో పాటు, ప్రజల్లో చైతన్యం కల్గించే కార్యక్రమాలను నిర్వహిస్తున్న యువజన సంఘాల నాయకుడు ఆడారి కిషోర్ కుమార్ కు పరమహంస పరివ్రాజకులు, ఆధ్యాత్మిక వేత్త త్రిదండి దేవనాధా జీయర్ స్వామి ఆశీర్వచన పూర్వక అభినందనలు అందించారు. 
ఈ సందర్బంగా ఆడారి కిశోర్ చేసిన 400 రోజుల అవిశ్రాంత స్వచ్ఛ భారత్ కార్యక్రమం, 69 మందితో

ఒకే రోజు నేత్రదానం అంగీకార పత్ర సేకరణ, రాష్ట్రం విడిపోకూడదు అని ఏకబికిన రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించిన యువకుల చైతన్య యాత్రలు, విద్యార్థి దశ నుంచి చేపట్టిన ఉద్యమాలను గురించి తెలిసి, స్వామిజి ఉద్యమ స్ఫూర్తి ని అభినందించారు. 
ప్రస్తుతం భారత దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న

తరుణంలో దేశ వ్యాప్తంగా ఆజాది కి అమృత్ మహోత్సవాలు జరుగుతున్నాయని, వీటిల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 
ప్రతి ఒక్కరి లోనూ దేశం పట్ల అభిమానం, భక్తి, గౌరవం ఉండడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడుతారన్నారు. 

దీనిలో భాగంగానే తాము చాతుర్మాస్య దీక్ష లో ఉన్నప్పడికి, యువతలో దేశ భక్తి -

విద్యా శక్తి పెంపొందించే విధంగా అవగాహన సదస్సులు విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఇదే అంశం పై విద్యార్థులతో ముఖాముఖీ కూడా ఉండవచ్చన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam