DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబు చేసిన అవినీతి పై ఛార్జి షీట్ దాఖలు చేస్తాం. : బీజేపీ మురళీధర్ రావు 

రాష్ట్రం లో క్రింద నుంచి పై స్థాయి వరకూ అవినీతే 

విశాఖపట్నం, ఆగస్టు 13, 2018 (DNS  Online ) : ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను ప్రక్కదారి పట్టించే విధంగా తప్పుడు లెక్కలు చూపిస్తూ,

కేంద్రాన్ని ప్రజల దృష్టిలో దోషిగా నిలిబెట్టే ప్రయత్నం చెయ్యడమే కాక, రాష్ట్రం లో అవినీతి పేరుకుపోడానికి ప్రధాన కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు

నాయుడుపై ఛార్జి షీట్ దాఖలు చేసి, విచారణకు ఆదేశిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన అయన సోమవారం నగరం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, భారత ప్రధాన మంత్రి

నరేంద్ర మోడీ ప్రతీ వేదికపైన తెలియచేస్తున్నప్పడికీ ప్రజలను ప్రక్కదాని పట్టించిన తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, ప్రధానంగా ఆ పార్టీ అధ్యక్షుడు,

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, కేంద్రం ప్రజలకోసం ఇచ్చే నిధులను ప్రక్కదారి పట్టించడమే కాకుండా, ప్రజా ధనంతో జల్సాలు చెయ్యడం

అత్యంత దురదృష్టకరమన్నారు. గత ఏడు దశాబ్దాలుగా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ దోచుకు తింటే, రాష్ట్రంలో గత నాలుగేళ్ల కాలం ను అత్యధికంగా దోచుకున్నది

చంద్రబాబేనన్నారు. అన్ని అవినీతి పనులపై చార్జీ షీట్ దాఖలు చేస్తే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఏ రూపంలో ఇచ్చింది ప్రజలకు అధికారులే

తెలియచేస్తారన్నారు.  à°ªà±à°°à°œà°²à°•à± జవాబు దారీ à°—à°¾ ఉంటామని à°—à°¤ ఎన్నికల్లో ఓటు అడిగామని, దాన్ని నిలబెట్టుకునే రానున్న ఎన్నికల్లో ప్రచారానికి వస్తామన్నారు. దానిలో

భాగంగానే à°ˆ చంద్రబాబు అవినీతి పై విచారణ అన్నారు. 

 

#dns #dnslive #dns live #dnsmedia  #dns media #dnsnews  #dns news #vizag  #visakhapatnam  #bjp #bharatiya janata party #muralidhar rao  #general secretary # andhra pradesh
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam