DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ తపాలా శాఖా నిర్వహణలో హర్ ఘర్ తిరంగా భైక్ ర్యాలీ 

*విశాఖపట్నం, ఆగస్టు  11, 2022 (డిఎన్ఎస్):*  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విశాఖపట్నం తపాలాశాఖ ఆధ్వర్యవంలో విశాఖపట్నం సాగర తీరంలో గురువారం బైక్ లతో తిరంగా ర్యాలీ నిర్వహించారు.  విశాఖపట్నం సీనియర్ సూపరెంటెండెంట్ జె. ప్రసాద్ బాబు ఈ ర్యాలీని ప్రారంభించారు. విశాఖలోని బీచ్ రోడ్ లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహం

కూడలి నుంచి కైలాసగిరి మీదుగా, ఎంవిపి కొలని లోని తపాలా శాఖా ప్రధాన కార్యాలయం వరకూ సాగింది. ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ భారత జాతీయ జండాలు, ప్లే కార్డు లను ధరించి బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ భారత దేశంలో అందరి కంటే అత్యంత అరుదైన అవకాశం కేవలం భారత తపాలా సంస్థకు

లభించిందని ప్రసాద్ బాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా ఉద్యమం లో భాగంగా ప్రజలు తమ ఇళ్ల వద్దు జాతీయ జండాను ఆ ఎగురవేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పోస్టల్ విభాగం ద్వారా కూడా జాతీయ జండాలను పంపిణీ చేసే అవకాశం లభించిందన్నారు. ఈ ర్యాలీ లో పోస్టల్ శాఖా ప్రతినిధులు నాగేశ్వర రావు, ఉద్యోగులు, తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam