DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వారిజ ఆశ్రమంలో దేవనాథ సమక్షంలో ఉపాకర్మ పూర్తి, వేద విద్య మొదలు 

*జీయర్ స్వామి రామాయణం, శ్రీకాంత్ స్వామి ఋగ్వేద పాఠం ప్రారంభం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  12, 2022 (డిఎన్ఎస్):* విశాఖపట్నం - భీమిలి బీచ్ రోడ్ లోని వారిజ ఆశ్రమం ( విశాఖపట్నం నుంచి భీమిలి బీచ్ రోడ్ లో గల చిన్న జీయర్ స్వామి వారి వేద పాఠశాల ) లో పరమహంస పరివ్రాజకులు

త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి సమక్షంలో బ్రహ్మచారులకు ఉపాకర్మ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుఝామునే 4 గంటల నుంచి కామో కార్షీ మంత్ర జపం 1008 
 సార్లు చేయించడంతో ఉపాకర్మ ప్రక్రియ మొదలుఅయ్యింది. అనంతరం విద్యార్థులు, గాయత్రీ మంత్రం జపం చేయడం, ఋషి తర్పణాలు, దేవా తర్పణాలు మంత్రం

పూర్వకంగా జరిపించారు.  తదుపరి ఓపనం,  సంధ్యావందనం, గురుపరంపర, హోమం లో హవనం, తదుపరి పూర్ణాహుతి ప్రక్రియ చేయడం ద్వారా ఉపాకర్మ క్రియ నిర్వహించారు. 

ఈ విద్యార్థులందరికీ పూర్ణాహుతి అనంతరం, త్రిదండి దేవనాథ జీయర్ స్వామి ఉపాకర్మ వైశిష్ట్యం, జరుపుకోడానికి గల కారణాలు, ఫలితం వివరించారు. వేదవిద్యను సంవత్సరం లో

కేవలం 6 నెలలు మాత్రమే నేర్పించడం జరుగుతుందని, మిగిలిన ఆరు నెలలు నేర్చుకున్న విద్యను మననం చేసుకోవాలన్నారు. శ్రావణ పొర్ణమి నాడు వేదవిద్య ను నేర్పించడం జరుగుతుందన్నారు. మాఘ మాసం లో ముగుస్తుందని, తదుపరి ఆరు నెలలు ఈ నేర్చుకున్న విద్యను మననం చేసుకోవాలన్నారు. 

తమ ఆచార్యులు అపర రామానుజులు త్రిదండి చిన్న జీయర్

స్వామి వారి సూచనల మేరకు వారిజ ఆశ్రమంలో ఉపాకర్మ ను ఆచరిస్తున్నామని, వేదవిద్యార్ధులతో పాటు, లౌకిక విద్యను అభ్యసిస్తున్న బ్రహ్మచారులతో కూడా ఉపాకర్మ విద్యానాన్ని ఆచరింపచేస్తున్నామన్నారు. వారికి ఉన్నత భవిష్యత్ లభించాలని ఆచార్యులు మంగళాశాసనం చేశారన్నారు. 

తదుపరి జీయర్ స్వామి విద్యార్థులందరికీ

శ్రీరామాయణం లోని మొదటి శ్లోకాలను నేర్పించారు. వారిజ ఆశ్రమంలోని ఋగ్వేద అధ్యాపకులు ముడుంబై శ్రీకాంత్ స్వామి ఋగ్వేదం లోని అగ్నిమీళే. . .శ్లోకంతో తోలి పాఠాన్ని ప్రారంభించారు. 

ఈ కార్యక్రమం లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది బ్రహ్మచారులు (వేద విద్యార్థులతో పటు, injaneering విద్యార్థులు కూడా)  పాల్గొని అత్యంత

శ్రద్దగా ఉపాకర్మ ప్రక్రియను ఆచరించారు.   

వైభవంగా సాగుతున్న శ్రీ లక్ష్మి యాగం 

విశాఖ లో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న త్రిదండి దేవనాథ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారిజ ఆశ్రమం లో శ్రావణ మాసం లో భాగంగా ఈ నెల 29 నుంచి జరుగుతున్నా శ్రీ లక్ష్మి యాగం లో నిత్య పూర్ణాహుతి వైభవంగా

జరిగింది. 

దేశ అభివృద్ధి కోసం, లోక కళ్యాణం కోసం మూల మంత్రం హవనం, శ్రీ సూక్త హోమం, భక్తుల విద్య, వ్యాపార, తదితర రంగాల్లో అభ్యున్నతి కోసం నక్షత్ర హోమాలను, వారిజ ఆశ్రమం వేదం పండితులచే నిర్వహిస్తున్నట్టు తెలియచేసారు. ఈ యాగ కార్యక్రమాలను దేవనాథ జీయర్ స్వామి వివరించారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam