DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ అటాచీ కు అమెరికా ఆఫర్, పెంటగాన్ లోని నేరుగా ఎంట్రీ కి వెసులుబాటు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  18, 2022 (డిఎన్ఎస్):* భారత్ దేశ ఆజాది క అమృతోత్సవ వేడుకల్లో భాగంగా అమెరికా భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు అమెరికా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ  ఫ్రాంక్ కాండిల్ ప్రకటన విడుదల చేసారు. భారత్ ఎంపిక చేసిన అధికారిక సైనిక అధికారి ( అటాచీ ) కి అమెరికా లోని

పెంటగాన్ ప్రధాన కార్యాలయంలోకి నేరుగా ప్రవేశం కల్పిస్తున్నట్టుగా తమకు అధికారిక సమాచారం వచ్చినట్టు తెలిపారు. అమెరికా లోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన ఆజాది కి అమృతోత్సవ్ వేళ భారత్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కాండిల్ ఈ ప్రకటన చేసారు.  

ఇది కేవలం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న

విదేశాంగ ప్రణాళికలే కారణంగా తెలియవచ్చింది. అన్ని దేశాలతోనూ భారత్ చేస్తున్న సన్నిహిత సంబంధాలు, పొరుగు దేశాలకు అందిస్తున్న సహకారం ఒక భాగం కాగా, మరొక ప్రక్క భారత్ కు రష్యా తో ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా మరొక కారణం కావచ్చు. 

గతంలో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధ సమయంలో అమెరికా సహకారం కోసం భారత్

సంప్రదించిన సమయంలో ఇదే అమెరికా అవమానించిన విషయం గమనార్హం. నేడు అదే అమెరికా నేడు తనంతట తానుగా భారత్ కు ఈ అఫర్ ఇవ్వడం వెనుక బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వ వ్యాప్తంగా అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు కలిగి ఉన్న భారత్ కు దగ్గర కావడం కారణం కావచ్చు. గత 70 ఏళ్ళల్లో అమెరికా ఏనాడూ భారత్ పట్ల ఈ విధమైన సంబంధాలను నడపలేదు.

కేవలం  నరేంద్ర మోడీ విదేశాంగ వ్యవహరాలను గమనించి, భవిష్యత్ లో భారత్ మరింత ముందు కువెళ్లి, అగ్రస్థానం చేరుకుంటుందని భయం కూడా కావచ్చు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam