DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రీసైక్లింగ్ చేస్తే ప్లాస్టిక్ ప్రమాదం కాదు : రాఘవేంద్ర రావు

విశాఖపట్నం, ఆగస్టు  13 , 2018 (DNS Online ): ప్రస్తుతం అన్నింటా ప్లాస్టిక్ వినియోగం అత్యవసరం అయిపోయిందని, వినియోగానంతరం దీన్ని రీసైక్లింగ్ చెయ్యగలిగితే ప్లాస్టిక్

ప్రమాదకరం కాదని కేంద్ర రసాయన మంత్రిత్వ శాఖా కార్యదర్శి రాఘవేంద్ర రావు తెలిపారు. సోమవారం CHEM 2018  à°¨à°—రంలోని à°“ హోటల్ లో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ సర్వత్రా

ప్లాస్టిక్ సంబంధిత పదార్ధాల వినియోగమే జరుగుతోందని, దీనిలో 50 మైక్రాన్ల లోపు తయారైన పాలిథీన్ సంచులతోనే అత్యంత ప్రమాదకరమన్నారు. దీన్ని రీసైక్లింగ్

చెయ్యవచ్చని, అయితే తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రజలు, ప్రభుత్వాల సంయుక్త సంఘీభావం తోనే ఈ తక్కువ స్థాయి పోలీ ఈథిలిన్ సంచులను రూపుమాపవచ్చన్నారు. చాలా

రాష్ట్రాల్లో ఈ మోతాదు సంచుల వినియోగం పై పూర్తిస్థాయి నిషేధం ఉందని, దీన్ని ఆంధ్ర ప్రదేశ్ లో అమలు చెయ్యడం లేదన్నారు. దీన్ని కేవలం ప్రభుత్వం ఒక్కటే అదుపు

చెయ్యలేదని, ప్రజల నుంచి కూడా సహకారం కావాలన్నారు. రానున్న కాలంలో ప్లాస్టిక్ వినియోగం మరింత విస్తృతం కానుందన్నారు. మంచి నీటి బోటిల్ నుంచి, మంచి నీరు త్రాగే

గ్లాసు వరకూ అన్నీ రీసైక్లింగ్ చెయ్యడం ద్వారానే మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #vizag news  #plastic  #chemical  #raghavendra rao


 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam