DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అజ్ఞాత దేశ భక్తుడు మునాబావు రైలు డ్రైవర్ సాహసానికి గుర్తింపు లభించిందా?

*1965 పాక్ యుద్ధ ప్రకటనతో వేగంగా రైలు నడిపి వందల ప్రాణాలు కాపాడారు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  19, 2022 (డిఎన్ఎస్):* 1965 సమయంలో భారత్ - పాకిస్తాన్ ల మధ్య రైలు మార్గం ద్వారా రాకపోకలు జరిగేవి. భారత్ లోని రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి  ( బార్మేర్ జిల్లా ) మునాబావు మీదుగా

 కొక్రాపర్ మీదుగా 300 కిలోమీటర్లు ప్రయాణించి  పాకిస్తాన్ లోని  సింద్ వరకూ వెళ్ళేది. అప్పట్లో ఈ రైలు వారంలో రెండు సార్లు తిరిగేది.

రైలు కొక్రాపర్ లో ఉండగా పాకిస్తాన్ యుద్దాన్ని ప్రకటించింది. ఆ రైలును అక్కడే ఆపేసి, భారతీయులను బందీలుగా చెయ్యాలని పాక్ పథకం.

ఈ కుట్రను పసిగట్టిన రైలు డ్రైవర్

సిగ్నల్ కోసం, ఎవరి అనుమతి కోసం ఎదురు చూడకుండా. . .రైలు ను అత్యంత వేగంగా నడిపి భారత్ లో పరిధిలోని మునాబావు రైల్వే స్టేషన్ కి తీసుకు వచ్చారు. ఆ సమయంలో ఆ రైలు లో వందలాది మంది భారతీయులు ప్రయాణిస్తున్నారు. మునాబావు బోర్డర్ ను పాకిస్తాన్ మూసేసి లోపే ఈ రైలు ను భారత్ సరిహద్దుల్లోకి తీసుకువచ్చేసారు. 

ఒక సాధారణ

రైల్వే డ్రైవర్ చేసిన సాహసం ఫలితంగా వందలాది మంది భారతీయులను పాక్ కి బందీలు కాకుండా రక్షించగలిగారు. అయితే ఆ డ్రైవర్ ఎవరో, పేరు ఏంటో కూడా తెలియక పోవడం గమనార్హం. ఆ సమయంలో ఆయన తన విధి నిర్వహణ ఒక్కటే తన ముందు ఉన్న లక్ష్యం. వందలాది మంది ప్రయాణీకులను క్షేమంగా వారి ఇళ్లకు చేర్చడమే తన లక్ష్యం అనుకున్నారు. అదే తడవుగా ఎంతో సాహసం

చేశారు. ఇదే రైల్లో భారత సైన్యానికి చెందిన ఏదో సామాగ్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన భారత రైల్వే చరిత్రలో ఎంతో ఉన్నతంగా భావిస్తుంటారు. ఈ రైలు సరిహద్దు దాటగానే భారత సైన్యానికి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది అని చెప్పడం అతిశయోక్తి కాదు. 

నాటి యుద్ధం లో అమరులైన వారి గౌరవార్ధం ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో అమర్ స్తూపం

కూడా నిర్మించారు.   
తర్వాత రైల్వే సర్వీస్ ఆగిపోయింది. తిరిగి 2006 లో రైలు మార్గం తెరిచారు. మళ్ళి పుల్వామా ఘటన తదుపరి నేడు ఈ మార్గాన్ని మూసివేశారు. 
భారత దేశంలో అత్యంత సామాన్యుడు సైతం దేశభక్తితోనే విధులు నిర్వహిస్తారు అనడానికి ఈ ఘటన ఒక జీవన కాల నిదర్శనం. 

భారత దేశం స్వాతంత్ర్య పోరాట సమయం నుంచి

లక్షలాదిగా అజ్ఞాత దేశభక్తులు ఎన్నో త్యాగాలు, సాహసాలు చేసి అందరికి స్ఫూర్తిగా నిలిచారు. స్వాతంత్య్రం అనంతరం కూడా దేశభక్తి చాటుకోవాల్సిన పరిస్థితులను దాయాది పాకిస్తాన్ ప్రతిరోజూ కల్పిస్తూనే ఉంది. దీనిలో భాగంగా 1965 లో పాకిస్తాన్ హఠాత్తుగా భారత్ పై యుద్దాన్ని ప్రకటించింది. దీంతో నాటి ప్రభుత్వం సుదీర్ఘ ఆలోచనలో

పడింది. దీనికి ప్రధాన కారణం ఈ మునాబావు ఘటన కూడా తెలియచేస్తోంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam