DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రి గుడివాడ చేసిన ఫోటోషూట్ ఏపీ లో ముందస్తు ఎన్నికలకు సంకేతమేనా? 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  19, 2022 (డిఎన్ఎస్):* మరో రెండేళ్ల కాల పరిమితి ఉండగానే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార హడావిడి మొదలైనట్టుగానే కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగానే ఉంది ఈ మంత్రి హడావిడి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కు చెందిన గుడివాడ అమర్ నాధ్ చేస్తున్న

ఫోటో షూట్ లు చూస్తే ఎన్నికల ప్రచారం కోసమో, లేక సినిమా షూటింగ్ కోసమో అన్నట్టుగానే ఉంది. ఇతనైతే సినిమా నటుడు కాదు, సినిమాల్లో నటించే ఆసక్తి లేదు, కనుక ఇది ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న ఏర్పాట్లు గానే సంకేతాలు అందుతున్నాయి. 
గత కొన్ని రోజులుగా అధికార పార్టీలో ఎవరికీ వారు అధ్యక్షుని దృష్టిలో పడేందుకు శతవిధాలా

కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు  ప్రతిపక్ష నేతలని విపరీతంగా దుర్భాషలాడడం చేస్తున్నారు. వీళ్ళందరితోపాటు, అమర్నాధ్ కూడా ప్రతిపక్షాన్ని దూషిస్తూనే మరో ప్రక్క ఎన్నికల ప్రచారం ఏర్పాట్లు సైతం చేస్తున్నట్టుగా సూచనలు అందుతున్నాయి. 
ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత లోటు

బడ్జెట్ లో ఉండడంతో పాటు, పరిశ్రమల రాక లో ఇబ్బందులు తలెత్తడంతో, వాటిని అధిగమించేందుకు శక్తి చాలక పోవడంతో అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని భావన పార్టీ వర్గాల్లోనే వచ్చినట్టు సమాచారం. దీనిపై అధిష్ఠానం నుంచి ఏరోజు ఏ విధమైన ఆదేశాలు వస్తాయో తెలియక, ఇప్పడి నుంచే ఎన్నికలకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు

తెలుస్తోంది. 
అయితే అమర్ నాధ్ ఫోటో షూటింగ్ కూడా దానిలో భాగమేనని అభిమానులు తెలియచేస్తున్నారు. ఈ షూటింగ్ కుటుంబపరంగా తీసుకున్నారు అనేందుకు ఏమాత్రం అవకాశం లేదు, కారణం, ఈ ఫోటోషూట్ లో కేవలం గుడివాడ అమర్ నాధ్ మాత్రమే పాల్గొన్నారు, ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ పాల్గొనక పోవడం గమనార్హం. 
ఇదే వాస్తవమైతే రాష్ట్రంలో

ఎన్నికల వేడి అతి తొందరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ధిక భారం నుంచి తలనొప్పులు తట్టుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే ముఖ్యమంత్రి ముందు ఉన్న ఏకైక పరిష్కారం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam