DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమిత్ షా మునుగోడు పర్యటన వెనుక మహా ప్రణాళిక ఉందా? 

*జూ.ఎన్ టిఆర్ తో భేటీ.. తెలుగు రాష్ట్రాల్లో గట్టి పాగా వేసేందుకేనా? 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  21, 2022 (డిఎన్ఎస్):* కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు చేపట్టిన తెలంగాణ పర్యటనలో హఠాత్తుగా మార్పులు చేయడం వెనుక ధృడమైన ప్రణాళిక కనపడుతోంది. ఆఖరి నిమిషంలో జూనియర్

ఎన్ టి ఆర్ ను రాత్రి డిన్నర్ మీట్ ఏర్పాటు చేయడం తో రాజకీయ వర్గాలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంతకాలం తటస్థంగా ఉన్న ఎన్ టిఆర్ ను బీజేపీ కి అనుకూలంగా మార్చినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అవుతుందనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ప్రక్క తెలంగాణ లో బీజేపీ కొంతవరకూ పుంజుకున్నప్పడికి అధికారం లోకి

వచ్చెంతగా ఉన్నట్టు అధిష్ఠానానికి నమ్మకం కలగలేదు. దీంతో అన్ని కోణాలు పరిశీలించి జూనియర్ ఎన్ టి ఆర్ ను తమ ప్రణాళిక లోకి లాగేందుకు సిద్దపడ్డట్టు తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం అమిత్ షా పర్యటనలో జూనియర్ ఎన్ టి ఆర్ భేటీ లేదు. నిన్న రాత్రి ఈ మార్పులు జరగడం, దీనికి ఎన్ టి ఆర్ ఒప్పుకోవడం జరగడంతో తెలంగాణ తో పాటు,

ఆంధ్ర లోని రాజకీయ పార్టీలకు గట్టి ఝలక్ తగిలినట్టు అయ్యింది. 
ఇదే జరిగితే తెలంగాణతో పాటు, ఆంధ్ర లోను మంచి అభిమానుల సంఖ్య ఉన్న ఎన్ టి ఆర్ బీజేపీ కి ఒక తుర్ఫు ముక్కగా మారతాడు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆంధ్ర కి ఇదొక బంపర్ ఆఫర్ లాంటిది. పూర్తిగా అంపశయ్య మీద ఉన్న ఆంధ్ర బీజేపీ కి అమిత్ షా చర్య ఆక్సిజన్

అందిస్తుంది. 

అయితే విపక్ష పార్టీలు మాత్రం దీనిపై ఆచితూచి స్పందిస్తున్నాయి. ఈ భేటీ ముగిసిన తర్వాతే తాము స్పందిస్తానంటూ తెలియచేస్తున్నాయి. 

ఎన్ టి ఆర్ రంగంలోకి వస్తే. . ఆంధ్ర బీజేపీ లో పూర్తి ప్రక్షణాల జరగడం ఖాయంగా కనపడుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు నుంచి జిల్లాల వరకూ పూర్తి ప్రక్షాళన జరిగే

అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాష్ట్ర పగ్గాలు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కి ఇచ్చే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో టీవీ, పత్రికల రంగాల్లో ఆధిపత్యం ఉన్న ఈ సామాజిక వర్గం ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డెందుకు బీజేపీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టు

తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం  ఒక ప్రముఖ టీవీ, పత్రిక సంస్థల అధిపతిని అమిత్ షా స్వయంగా కలవనున్నారు. 

తమ సీటుకు భంగం కలుగుతుంది అనే భయంతోనే గత మూడేళ్ళుగా మొద్దు నిద్రపోయిన ఆంధ్ర బీజేపీ నేతలు ర్యాలీలు చేపట్టినట్టు సమాచారం. అయితే ఈ ర్యాలీలను పట్టించుకునే తీరిక బీజేపీ అధిష్టానానికి

లేకపోవడం గమనార్హం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam