DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశ, ఆంధ్ర అభివృద్ధి కోసం వారిజ ఆశ్రమం లో శ్రీ యాగం మహాపూర్ణాహుతి  పూర్తి  

https://www.youtube.com/watch?v=tGoyWQj3xOA&t=491s

 

*త్రిదండి దేవనాథ జీయర్ స్వామి పర్యవేక్షణ లో విశాఖ వారిజ లో ఘనంగా తిరుకళ్యాణం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, ఆగస్టు 26, 2022 (డిఎన్ఎస్):* పరమహంస పరివ్రాజకులు త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారి

ప్రత్యక్ష పర్యవేక్షణలో విశాఖ - భిమిలీ బీచ్ రోడ్ లో గల వారిజ ఆశ్రమం ( చిన్న జీయర్ స్వామి వారి వేద పాఠశాల ) లోని శ్రీ లక్ష్మి హయగ్రీవ స్వామి మందిరంలో నిర్వహిస్తున్న శ్రీ యాగం మహాపూర్ణాహుతి శుక్రవారం వైభవంగా జరిగింది. స్వామివారు నిర్వహిస్తున్న చాతుర్మాస్య దీక్ష లో భాగంగా గత నెల 30 నుంచి ఈ నెల  26 వరకూ దేశ సంక్షేమం కోసం,

రాష్ట్రాభివృద్ధి కోసం, ఉత్తరాంద్ర జిల్లాల భ్యున్నతి కోసం శ్రీ లక్ష్మి యాగం జరుగుతున్న విషయం తెలిసిందే. 

దేశ అభివృద్ధి కోసం, లోక కళ్యాణం కోసం మూల మంత్రం హవనం, శ్రీ సూక్త హోమాలను, వారిజ ఆశ్రమం వేద పండితులచే నిర్వహిస్తున్నట్టు దేవనాథ జీయర్ స్వామి వివరించారు. సుమారు 200 మందికి పైగా పాల్గొని స్వామి, అమ్మవారి

అనుగ్రహానికి మిత్రులయ్యారు. మహా పూర్ణాహుతి అనంతరం శ్రీ లక్ష్మి హయగ్రీవ మందిరంలో శ్రీ సీతా రామచంద్ర పెరుమాళ్ళకు తిరుకళ్యాణం ఘనంగా జరిగింది. 

ఈ కార్య క్రమం లో సుమారు ఉపమాక  శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం అర్చక బృందం, వారిజ నిర్వాహక కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

శ్రావణ

మాసం - శ్రీ యాగం వివరాలు. .

సనాతన హైందవ సంప్రదాయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రాధాన్యత ఉందని, ప్రత్యేకించి శ్రావణ మాసం లో అమ్మవారి అనుగ్రహం కోసం ఆరాధన చెయ్యడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ శుభ సందర్బంలో 27 రోజుల పాటు వారిజ వేదిక గా శ్రీ సూక్త, మూలమంత్ర హవనం, నక్షత్ర హోమం నిర్వహిస్తున్నామన్నారు.

 గత నెల 29 న అంకురారోపణ, మృత్సంగ్రహణ తో ప్రారంభమయ్యిందని, 30 వ తేదీ ఉదయం అగ్ని ప్రతిష్ఠా మహోత్సవం వైదిక పరంగా ఆరంభమయ్యిందన్నారు.

శ్రీ లక్ష్మి యాగంలో భాగంగా ప్రతి రోజూ హోమ కార్యక్రమం జరుగుతోందని, మూలమంత్రం, ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికీ అభివృద్ధి కలగాలని నక్షత్ర శాంతి హోమం, శ్రీ సూక్త హోమం, నిత్యా

పూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు. అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ చేయడం జరుగుతోందన్నారు.

శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ప్రతి శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. 

గత 26

రోజుల్లో ఆగస్టు 1 : ఆండాళ్ తిరునక్షత్రం, ఆగస్టు 3 : బదరి నారాయణ పెరుమాళ్ తిరునక్షత్రం, ఆగస్టు 5 : శ్రీ వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 11 : శ్రీ హయగ్రీవ జయంతి, ఆగస్టు 15 : పెద్ద జీయర్ స్వామి తిరునక్షత్రం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఆగస్టు 20 : శ్రీ కృష్ణాష్టమి, ఆగస్టు 26 : మహా పూర్ణాహుతి తో శ్రావణ మాసోత్సవాలు, యాగం పూర్తి. 



వేడుకల్లో పాల్గొనేందుకు అందరికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ వారిజ ఆశ్రమానికి వచ్చి, యాగ కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం తదియారాధన లో ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. వివరాలకు ఆశ్రమ వేదపండితులు శ్రీకాంత్ స్వామి (ఫో: 92472 17901 )  ని సంప్రదించవచ్చని తెలిపారు. 

 

">

https://www.youtube.com/watch?v=tGoyWQj3xOA&t=491s

 

*త్రిదండి దేవనాథ జీయర్ స్వామి పర్యవేక్షణ లో విశాఖ వారిజ లో ఘనంగా తిరుకళ్యాణం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, ఆగస్టు 26, 2022 (డిఎన్ఎస్):* పరమహంస పరివ్రాజకులు త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారి

ప్రత్యక్ష పర్యవేక్షణలో విశాఖ - భిమిలీ బీచ్ రోడ్ లో గల వారిజ ఆశ్రమం ( చిన్న జీయర్ స్వామి వారి వేద పాఠశాల ) లోని శ్రీ లక్ష్మి హయగ్రీవ స్వామి మందిరంలో నిర్వహిస్తున్న శ్రీ యాగం మహాపూర్ణాహుతి శుక్రవారం వైభవంగా జరిగింది. స్వామివారు నిర్వహిస్తున్న చాతుర్మాస్య దీక్ష లో భాగంగా గత నెల 30 నుంచి ఈ నెల  26 వరకూ దేశ సంక్షేమం కోసం,

రాష్ట్రాభివృద్ధి కోసం, ఉత్తరాంద్ర జిల్లాల భ్యున్నతి కోసం శ్రీ లక్ష్మి యాగం జరుగుతున్న విషయం తెలిసిందే. 

దేశ అభివృద్ధి కోసం, లోక కళ్యాణం కోసం మూల మంత్రం హవనం, శ్రీ సూక్త హోమాలను, వారిజ ఆశ్రమం వేద పండితులచే నిర్వహిస్తున్నట్టు దేవనాథ జీయర్ స్వామి వివరించారు. సుమారు 200 మందికి పైగా పాల్గొని స్వామి, అమ్మవారి

అనుగ్రహానికి మిత్రులయ్యారు. మహా పూర్ణాహుతి అనంతరం శ్రీ లక్ష్మి హయగ్రీవ మందిరంలో శ్రీ సీతా రామచంద్ర పెరుమాళ్ళకు తిరుకళ్యాణం ఘనంగా జరిగింది. 

ఈ కార్య క్రమం లో సుమారు ఉపమాక  శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం అర్చక బృందం, వారిజ నిర్వాహక కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

శ్రావణ

మాసం - శ్రీ యాగం వివరాలు. .

సనాతన హైందవ సంప్రదాయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రాధాన్యత ఉందని, ప్రత్యేకించి శ్రావణ మాసం లో అమ్మవారి అనుగ్రహం కోసం ఆరాధన చెయ్యడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ శుభ సందర్బంలో 27 రోజుల పాటు వారిజ వేదిక గా శ్రీ సూక్త, మూలమంత్ర హవనం, నక్షత్ర హోమం నిర్వహిస్తున్నామన్నారు.

 గత నెల 29 న అంకురారోపణ, మృత్సంగ్రహణ తో ప్రారంభమయ్యిందని, 30 వ తేదీ ఉదయం అగ్ని ప్రతిష్ఠా మహోత్సవం వైదిక పరంగా ఆరంభమయ్యిందన్నారు.

శ్రీ లక్ష్మి యాగంలో భాగంగా ప్రతి రోజూ హోమ కార్యక్రమం జరుగుతోందని, మూలమంత్రం, ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికీ అభివృద్ధి కలగాలని నక్షత్ర శాంతి హోమం, శ్రీ సూక్త హోమం, నిత్యా

పూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు. అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ చేయడం జరుగుతోందన్నారు.

శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ప్రతి శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. 

గత 26

రోజుల్లో ఆగస్టు 1 : ఆండాళ్ తిరునక్షత్రం, ఆగస్టు 3 : బదరి నారాయణ పెరుమాళ్ తిరునక్షత్రం, ఆగస్టు 5 : శ్రీ వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 11 : శ్రీ హయగ్రీవ జయంతి, ఆగస్టు 15 : పెద్ద జీయర్ స్వామి తిరునక్షత్రం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఆగస్టు 20 : శ్రీ కృష్ణాష్టమి, ఆగస్టు 26 : మహా పూర్ణాహుతి తో శ్రావణ మాసోత్సవాలు, యాగం పూర్తి. 



వేడుకల్లో పాల్గొనేందుకు అందరికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ వారిజ ఆశ్రమానికి వచ్చి, యాగ కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం తదియారాధన లో ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. వివరాలకు ఆశ్రమ వేదపండితులు శ్రీకాంత్ స్వామి (ఫో: 92472 17901 )  ని సంప్రదించవచ్చని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam