DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి వేద, ఆగమ పాఠశాలకు పునర్వైభవాన్నీ తీసుకువస్తాం: ట్రస్ట్ సభ్యులు గంట్ల శ్రీనుబాబు 

*పాఠశాల సందర్శన లో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు హామీ*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, ఆగస్టు 29, 2022 (డిఎన్ఎస్):* సింహాచలం దేవస్థానం ఆగమ పాఠశాల దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోందని, దానికి పునర్వైభవాన్నితీసుకువస్తామని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు

గంట్ల శ్రీనుబాబు తెలియచేసారు. సోమవారం అయన సింహాచలం దేవస్థానం ఆగమ పాఠశాలను సందర్శించారు. ఆగమ పాఠశాల లో జరుగుతున్నా తరగతులు, విభాగాలు, విద్యార్థుల వివరాలను పాఠశాల  ప్రిన్సిపాల్ శ్రీకాంత్ స్వామి వివరించారు. ఇక్కడ ప్రస్తుతం 30 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యాభ్యాసం చేస్తున్నారన్నారు. ఒకటి రెండు

విభాగాల్లో అధ్యాపకులు లేరని, మిగిలిన విభాగాల్లో పూర్తి స్థాయి తరగతులు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల కోసం కూడా శ్రీనుబాబు ఆరా తీశారు. ఈ. పాఠశాల ఎంతో ప్రాచుర్యం పొందింది అని ఇక్కడ చదువుకున్న వందలాది మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు పొందిన విషయాన్నీ

విద్యార్థులకు శ్రీనుబాబు వివరించారు. శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి అనుగ్రహంతో ప్రతి విద్యార్థి అత్యున్నత స్థితి కి వెళ్లాలని, దానికి తగిన కృషి, భక్తి తో అక్షర దోషం లేకుండా, అపస్వరం కాకుండా మంత్రోచ్చారణ శ్రద్ధగా విద్యాభ్యాసం సాగించాలని ఆయన ఆకాంక్షించారు. మరిన్ని మెరుగైన సదుపాయాల కల్పన కోసం త్వరలోనే ధర్మకర్తల

మండలి ఆగమ పాఠశాలను సందర్శించి అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈఓ భ్రమరాంబ, ధర్మకర్తల మండలి సభ్యులకు తెలియ చేస్తామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam