DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో అపచారం. .క్రైస్తవ లారీల్లో గణేశ నిమజ్జనం, అడ్డుకున్న విహెచ్పి 

*విగ్రహ నిమజ్జనం నీళ్ల ట్యాంక్ లపై క్రాస్ సింబల్స్, కరుణామయుడు. పేర్లు.* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, సెప్టెంబర్ 01, 2022 (డిఎన్ఎస్):* హిందూ సమాజం పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య భావంతో ఉంది అనే విషయం ప్రతి రోజూ బయట పడుతూనే ఉంది. దీనికి నిదర్శనమే సాక్షాత్తు వినాయక చవితి

రోజున విశాఖ మహా నగర పాలక సంస్థ అధికారులు విగ్రహాల తాత్కాలిక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన నీళ్ల ట్యాంకులు ఉన్న లారీలు క్రైస్తవ వ్యాపారులవి కావడం, లారీలపై క్రైస్తవ మతచిహ్నాలు ఉండడం గమనార్హం. దీన్ని విశ్వ హిందూ పరిషత్ విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ నేతృత్వంలోని బృందం

అడ్డుకుంది. 

వివరాల్లోకి వెళితే. . జీవీఎంసీ 98 వ వార్డు సింహపురి కాలనీ పార్కులో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం తాత్కాలిక ట్యాంక్ లను లారీల్లో జీవీఎంసీ ఏర్పాటు చేసింది. అయితే ఈ లారీలపై క్రైస్తవ మత చిహ్నాలైన శిలువ సింబల్స్, కరుణామయుడు పేర్లు తో నిండి ఉండడాన్ని విహెచ్ పి బృందం ప్రశ్నించింది. ఇది ప్రభుత్వం

ఇచ్చిన ఆదేశాలు, తమకు ఏమి తెలియదంటూ జివిఎంసి నిర్వాహకులు ప్రకటించడంతో పూడిపెద్ది శర్మ తో పాటు  హిందూ సభ్యులు మండిపడ్డారు. 

కేవలం 9 రోజుల పాటు హిందువులు పండుగ చేసుకునే వినాయక చవితి కి ఇదే ప్రభుత్వం సవా లక్ష ఆంక్షలు పెట్టడంతో పాటు భారీ గా నగదు కట్టించుకుని కూడా హిందువులను పురుగులు గా చూస్తున్నారంటూ

మండిపడ్డారు. స్థానిక జ్ఞానాపురం ప్రాంతంలో వినాయక మండపాలు పెట్టరాదంటూ స్థానిక పివిపి క్రైస్తవ సంఘాలు హిందువులను తీవ్ర స్థాయిలో అడ్డుకున్నాయన్నారు. దీనిపై స్థానిక ఎమ్మాఆర్ ఓ, పోలీసులకు ఫిర్యాదు చేసిన నోరు మెదపలేదన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా హిందూ ద్వేషంగా ఉన్నట్టుగానే ఈ ఘటనలు

నిరూపిస్తున్నాయన్నారు. 

హిందువులు వినాయకచవితి పందిళ్లు వెయ్యడానికి ప్రభుత్వం సవా లక్ష ఆంక్షలు పెట్టిందని, వినాయక చవితి చేసుకోడానికి అనుమతులు ఇవ్వడానికి చేతులు రాని ప్రభుత్వ అధికారులకు క్రైస్తవ లారీలకు డబ్బులు గుమ్మరించడానికి వచ్చాయన్నారు.  

హిందూ దేవి దేవతలా విగ్రహాల నిమజ్జనానికి

క్రైస్తవ లారీలు తప్ప హిందువుల లారీలు జివిఎంసి కి కనపడలేదా అని మండిపడ్డారు. దీనిపై జివిఎంసి కమిషనర్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని పూడిపెద్ది శర్మ డిమాండ్ చేసారు. ఈ దుశ్చర్యలకు పాల్పడిన జివిఎంసి అధికారులపై తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam