DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21 న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినము. మాత్రల పంపిణీ

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, సెప్టెంబర్ 20 , 2022 (డిఎన్ఎస్):*  రాష్ట్ర వ్యాప్తంగా తేది 21.09.2022 మరియు 24.09.2022 జాతీయ నులిపురుగుల నిర్మూలన దినము సందర్భంగా తగిన వైద్య చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖపట్నం  జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ K. విజయ లక్ష్మి తెలిపారు. మంగళవారం నిర్వహించిన

 విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినము లో భాగంగా విశాఖపట్నం జిల్లాలో గల 1 నుండి 19 సంవత్సరముల వయసు గల బాల బాలికలకు అనగా అంగన్వాడి ఎయిడెడ్ మరియు ప్రైవేటు పాటశాలలు మరియు కళాశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు కొమార బాల బాలికలకు నులిపురుగుల నిర్మూలన నిమిత్తము అల్బెండజోల్ మాత్రలను

ఉచితముగా ఇస్తారన్నారు. ఈ మాత్రలను 1 సంవత్సరము నుండి రెండు సంవత్సరముల వయసు గల పిల్లలకు సగము మాత్రను నీటిలో కరిగించి త్రాగించాలన్నారు.  రెండు నుండి పంతొమ్మిది సంవత్సరముల వయసు గల వారికి పూర్తి మాత్రను మధ్యాహ్నం భోజనం చేసిన అర గంట తరువాత దప్పరించేటట్లు చూడాలన్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు

చేసింది. మాత్రను చప్పరించడం ఎటువంటి దుస్పరినామాలు కలుగవని తెలియజేయడమైనదన్నారు. తేది 21.09.2022 మరియు 24.09.2022 న జరిగే కార్యక్రమంలో ఈ మాత్రను తప్పక వేసుకోవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది ఈ కార్యక్రంమాన్ని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు విద్యాశాఖా మరియు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖల సహకారంతో

నిర్వహించనున్నారన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam