DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో పెట్టుబడులు పెడతాం: వైఎస్ జగన్‌తో టాటా చైర్మన్‌ భేటీ 

*(DNS Report: P Raja, Burau Chief, Amaravati)*    

*అమరావతి  సెప్టెంబర్ 22, 2022 (డీఎన్ఎస్) :* ఏపీ ప్రభుత్వ పారిశ్రమిక విధానం పెట్టుబడులకు దన్నుగా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ కొనియాడారు. రాష్ట్రంలో టాటా సన్స్ గ్రూప్ పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో టాటా సన్స్ చైర్మన్ సీఎం

జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సీఎం జగన్ తమ ప్రభుత్వం అవలంభిస్తున్న పారదర్శక పారిశ్రామిక విధానం గురించి వివరించారు. భారీ పరిశ్రమల స్థాపనకు అవసరమైన మానవ వనరులకు, మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టాటా సన్స్ గ్రూపు పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం

అందిస్తుందన్నారు. అత్యధిక జీఎస్డీపీ సాధించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇప్పటికే సెజ్ ల్లో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని టాటా సన్స్ చైర్మన్ కు వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ర్యాంక్ సాధించడం కోసం

అవాలంభించిన నూతన పారిశ్రమిక విధానాలను సీఎం జగన్ ఈ సందర్భంగా వివరించారు. ఉత్తమ పారిశ్రమిక విధానం వల్ల అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు రాష్ట్రానికి వచ్చేందుకు సముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలనే కలను సాకారం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని టాటా సన్స్ చైర్మన్

అన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ కరికాల వల్లవన్, ఏపీ ఇఒడిబి సిఇఒ జె సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam