DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్ టి ఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై గవర్నర్ తో చంద్రబాబు భేటీ 

*(DNS Report: P Raja, Burau Chief, Amaravati)*    

*అమరావతి, సెప్టెంబర్ 22, 2022 (డి ఎన్ ఎస్) :* ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలోనే ఎంతో ఖ్యాతిగాంచిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మారుస్తూ ఏపీ అసెంబ్లీ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్

హరిచందన్ ను కలిశారు. గురువారం తెలుగుదేశం నేతలు ఆడారి కిషోర్ కుమార్, అచ్చింనాయుడు, తదితర బృందం గవర్నర్ ను కలిశారు. ఈ జీవో ను తక్షణం రద్దు చేయాలనీ, అంగీక వద్దని కోరారు. దీనికి సమాధానంగా అసెంబ్లీ ఈ బిల్లు ను ఎప్పుడు ప్రవేశ పెట్టింది, ఆమోదించిందా అనే ప్రశ్న గవర్నర్ వెయ్యడంతో చంద్రబాబు విస్తుపోయారు. ఈ విద్యాలయం స్థాపనకు

గల కారణాలు, చరిత్రను గవర్నర్ కు వివరించారు.

అనంతరం  మీడియా తో మాట్లాడుతూ శాసనసభలో ఏపీ ప్రభుత్వం అనాగరిక, పనికిమాలిన, చీకటి చట్టాన్ని చేసిందన్నారు. 

ఎన్టీఆర్ క్రియేటర్....

తెలుగువారి గుండెల్లో ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. సినీ, రాజకీయ రంగాల్లో ఆయనకు ప్రత్యేక ముద్ర ఉందన్నారు. వైద్య రంగానికి

ఎన్టీఆర్ చేసిన పనుల్లో కీలకమైనవి. .. హైదరాబాద్ లోని నిమ్స్ కు  స్వయంప్రతిపత్తి కల్పించారని, డా. కాకర్ల సుబ్బారావును దానికి డైరెక్టర్గా నియమించారు. రాష్ట్రంలోని అన్ని వైద్య కాలేజీలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని హెల్త్ యూనివర్సిటీని స్థాపించారు. వైద్యరంగానికి ఎన్టీఆర్ చేసిన సేవలకు అనుగుణంగా 1998లో తానూ సీఎంగా

ఉండగా హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టామన్నారు.

ఛాన్సలర్ గా ఉన్న గవర్నర్ కె ఈ పేరు మార్పు తెలియచేయలేదు అంటే. . .రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందొ తెలుస్తోందన్నారు. ఈ విషయం గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా ప్రవర్తించారన్నారు. 

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్నా ఈ ఏడాదే అయన పేరు తొలగించడం తెలుగు

జాతికి జగన్ చేసిన ద్రోహమన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam