DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిక్కవోలు గుడి అపచారానికి దేవాదాయ శాఖ నిర్లక్ష్యమే కారణం

అధికారులు తప్పించుకోవడం పై విశ్వహిందూ పరిషత్ మండిపాటు 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, సెప్టెంబర్ 26, 2022 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండల కేంద్రంలోని అత్యంత పురాతనమైన గోలింగేశ్వర స్వామి దేవాలయం ( సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి) ప్రకారంలోని శివలింగం

 సానపెట్టకు టెంట్ హౌస్ తాళ్లు కట్టడం పై తప్పిదం దేవాదాయ శాఖ సిబ్బందిదేనని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ సభ్యుడు పూడిపెద్ది శర్మ మండిపడ్డారు. 
రెండు రోజుల క్రితం ( శనివారం ) ఈ ఆలయం ప్రాకారానికి అనుకుని ఉన్న ఆవరణలో జరిగిన వైఎస్సార్ చేయుట కార్యక్రమ సభ కోసం వేసిన టెంట్ షామియానా తాళ్లు ప్రక్కనే ఉన్న ఈ గుడి లో

బయటే ఉన్న శివలింగానికి కట్టడం వివాదంగా మారింది. అయితే ఈ తాళ్లు కట్టే సమయం లోనే దేవాలయ అధికారులు, సిబ్బంది అడ్డుకోవాల్సి ఉండగా, వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం గా  ఉన్న కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని తేట తెల్లమయ్యిందన్నారు. 
అయితే ఈ సభ కోసం ఏర్పాట్లు చేసేందుకు ప్రత్యేక కమిటీలు, అధికారులు కూడా నేరుగా పాల్గొనడం

జరుగుతుంది. వాళ్ళెవ్వరూ ఈ గుడి పట్ల జరిగిన అపచారాన్ని అడ్డుకోక పోగా, వాళ్ళ కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోయినట్టు తెలుస్తోందన్నారు. 

ఇదే సమయంలో ఆలయానికి వచ్చిన కొందరు భక్తులు చూసి ఆవేదన చెంది, ఈ దుర్ఘటనను వీడియో తీసి  సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో భక్తులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీంతో జరిగిన తప్పు

నుంచి ప్రక్కవాళ్ళ పైకి నెట్టేయడం బాగా అలవాటు ఉన్న దేవాదాయ శాఖ  ఈ తప్పును ఆ టెంట్ కట్టిన టెంట్ హౌస్  నిర్వాహకుడు, అతని సహాయకుడి పైకి నెట్టేస్తూ పోలీస్ ఫిర్యాదు చేసినట్టు తెలిసిందన్నారు. 

అయితే ఈ తప్పిదం జరగక ముందే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈఓ  చేతులు దులుపేసుకుని,

అర్భకులని బలి పశువులను చేసే ప్రయత్నానికి ఒడికట్టారని విహెచ్ పి   మండిపడుతోందన్నారు. 

గత కొన్నేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూ దేవాలయాలు, దేవీదేవతలు విగ్రహాలపై దాడులు జరుగుతున్నా తరుణం లో గుడి ప్రక్కన జరుగుతున్నా ఈ సభ ను మరింత జాగ్రత్తగా నిర్వహించవలసి ఉండగా, అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది

నిర్లక్ష్యం గా ఉన్న కారణంగా జరిగిన తప్పిదం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. 

ఆలయం ప్రాకారం లోపల ఉన్న ప్రతి విగ్రహం, వస్తువు ఎంతో పవిత్రమైనదన్నారు. 

ఈ ఘటన పై ఆలయ అధికారులు, సభ సమావేశం చేసిన నిర్వాహకులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపిపి, ఎమ్మెల్యే లు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం

ఉందని డిమాండ్ చేస్తున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam