DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభివృద్ధి ఆశాజ్యోతి అడుగు విశాఖ లో పడింది.

గన్నవరం మెట్టు లో ప్రజా సంకల్పయాత్ర ప్రవేశం

విశాఖపట్నం, ఆగస్టు 14 , 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ బడుగు, బలహీన, యువత దశ దిశా మార్చే అభివృద్ధి 
ఆశాజ్యోతి అడుగు విశాఖ

లో పడింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా గత 237 లు గా ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర

విశాఖ జిల్లాలో అడుగు పెట్టింది. విశాఖ జిల్లా నర్సీపట్నం శాసన సభ నియోజక వర్గం లోని నాతవరం మండల పరిధిలోని పి గన్నవరం మెట్టులో మంగళ వరం ఉదయం 9 గంటల ప్రాంతంలోకి

ప్రవేశించారు. గతంలో నాటి ప్రతిపక్ష నేత హోదాలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే గ్రామం లో అడుగు పెట్టి విశాఖపట్నం జిల్లాలో అడుగుపెట్టారు. అదే నమ్మకమో, ఏమో,

నేడు దాదాపు 15 ఏళ్ళ తర్వాత జగన్ కూడా అదే గ్రామం లోనే అడుగు పెట్టి జిల్లాలో ప్రవేశించారు. ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న విశాఖ జిల్లా వాసులకు ఆశాజ్యోతిలా

ప్రవేశించిన జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లా ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాధ్, నేతృత్వంలోని

క్యాడర్ బైక్ రాలీ నిర్వహించారు. వాతావరణం అనుకూలించనప్పడికీ కార్యకర్తలు తమ పార్టీ అధినేతకై గంటల కొద్దీ సమయం వేచియున్నారు.

తూర్పు గోదావరి జిల్లా

కాకరాపల్లి గ్రామం లో మంగళవారం ఉదయం పాదయాత్ర మొదలు పెట్టి, విశాఖపట్నం జిల్లా గన్నవరం మెట్టు లోకి ప్రవేశించగానే ఉవ్వెత్తున పార్టీ క్యాడర్ ఘన స్వాగతం

పలికింది. గత 50 రోజులుగా 412 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్ర నేటి తో ముగుస్తోంది. విశాఖపట్నం జిల్లాలో 15 శాసన సభా నియోజక వర్గాల్లోనూ ప్రజా సంకల్పయాత్ర

సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam