DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ రాకుంటే రాజీనామా: విజయసాయి, ఆబ్బె జోన్ ఔటర్ లోకి వచ్చేసింది: బీజేపీ

*రైల్వే జోన్ . . వైకాపా, బీజేపీ ల ఎన్నికల తాయిలం తెరపైకి వచ్చేసింది.*

*రైల్వే జోన్ అంశం వచ్చింది అంటే. త్వరలోనే ఎన్నికలు వస్తాయన్న మాట?* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, సెప్టెంబర్ 28, 2022 (డిఎన్ఎస్):*  విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ . . ఏపీలో వైకాపా, బీజేపీ ల ఎన్నికల తాయిలం

తెరపైకి వచ్చేసింది. అంటే అతి త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి అనే సంకేతాలు అందుతున్నాయి. గత దశాబ్ద కాలంగా వైకాపా, బీజేపీ లు చేస్తున్న భీకర ప్రతిజ్ఞలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు చూసి జనం విసిగిపోయారన్న ఇంగితం లేకుండా రాజకీయ నేతలు మరోసారి భీకర ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. 25 మంది ఎంపీ లు ఇస్తే రైల్వే జోన్

పై పోరాటం చేస్తామన్న వైకాపా ఏనాడూ రైల్వే జోన్ పై సీరియస్ గా పార్లమెంట్ లో విరుచుకు పడిన దాఖలాలు లేవు. పైగా ఇదే అంశం పై ఎంపీ విజయ సాయి రెడ్డి విసిరిన సవాల్ కు బీజేపీ నేతలు మరింత విరుచుకు పడుతూ నానా రభస చేస్తున్నాయి. 

మూడు పర్యాయాలు ఎంపీ గా ఉన్న విజయ సాయి రెడ్డి రైల్వే జోన్ రాకపోతే రాజీనామా అంటూ చేసిన భీకర

ప్రకటనతో వైకాపా కు సానుభూతి పెరిగిపోతోందన్న ఆదుర్దా తో బీజేపీ నేతలు తమ స్థాయికి మించి దీనిపై వివరణలు ఇచ్చేస్తున్నారు. 

విశాఖ నుంచి ఎంపీ బరిలో ఉన్నట్టుగా చెప్పబడుతున్న బీజేపీ ఎంపీ జివిఎల్ నర్శింహారావు విజయ సాయి సవాల్ కు సమాధానం ఇస్తూ రైల్వే జోన్ వచ్చేస్తోంది అని ప్రకటన విడుదల చేస్తున్నారు తప్పితే ఇదే

విషయం రైల్వే శాఖా మంత్రి ద్వారా చెప్పించలేకపోవడం గమనార్హం. 

జోన్ అంశం పూర్తిగా రైల్వే శాఖా పరిధిలోది కావడంతో మాట్లాడవలసిన రైల్వే మంత్రి వైష్ణవ్ గానీ, రైల్వే bordu చైర్మన్ గానీ ఎటువంటి ప్రకటన చెయ్యక పోవడం గమనార్హం. 

ఉత్తరాంధ్ర జిల్లా ప్రజల దశాబ్దాల పోరాట ప్రభావం విశాఖ రైల్వే జోన్ అంశం పై అన్ని

రాజకీయ పార్టీలు ప్రతి రోజూ 70 ఎంఎం సినిమాలు చూపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ రైల్వే జోన్ అంశం నేపధ్యంగానే ప్రజల ముందుకు వచ్చింది. అయితే  నాడు బీజేపీ, తెలుగుదేశం, కలిసి పోటీ చెయ్యడం తో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారానికి దూరమయ్యింది. అయితే రెండు పార్టీ ల జంతర్ మంతర్ గేమ్ లో రైల్వే జోన్ ను ఒక పావులా వాడుకుని, పబ్బం

గడుపుకున్నాయి. ఇదే అంశం తో 2019 లోనూ బీజేపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఎన్నికల్లో ప్రచారం చేసాయి. 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వచ్చి మరీ రైల్వే జోన్ తెస్తాం అంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటన ను మొత్తం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అందరూ నమ్మరు. ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిపించి చట్ట సభలకు పంపారు.

అయితే వైకాపా సైతం ప్రజలని మోసగిస్తూ. . పార్లమెంట్ లో నోరు విప్పిన పాపాన పోలేదు. పోరాటం చేస్తామన్న వైకాపా తప్పించుకు తిరిగేందుకు ఒక డొంక వెతుకున్నది. 

మాకు 22 ఎంపీ సీట్లు ఇచ్చారు సరే. .అయితే బీజేపీ కి కేంద్రం లో పూర్తిగా మెజారిటీ ఇచ్చేశారని, దాంతో మెం కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నాం అంటూ సాకులు

చెప్పింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam