DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవంబర్ 12న విశాఖ రైల్వేజోన్ కు ప్రధాని మోడీ చే  శంకుస్థాపన!

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, అక్టోబర్ 28, 2022 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల చిరకాల స్వప్నం విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుకానున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 12 న శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ

మూడోసారి విశాఖలో పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ఆయన రైల్వే జోన్ శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టను న్నారు. ఇందుకోసం నవంబర్ 11న విశాఖకు ఆయన రానున్నారని అధికారిక వర్గాల సమాచారం. ఈ పర్యటనలో రూ.వేల కోట్ల అభివృద్ధి పసులకు శ్రీకారంతో పాటు ప్రారంభోత్సవాలు

నిర్వహించనున్నారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా... విశాఖలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారు. ఇందులో భాగంగా.. నవంబర్ 11న ఆయన విశాఖ చేరుకుని ప్రధానితో కలిసి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఈ కార్యక్రమం లో ప్రధాని తో పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా

పాల్గొనున్నారు. ఈ క్రమంలోనే వడ్లపూడి వ్యాగన్ వర్క్ షాప్ జాతికి అంకితం, రూ.446 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన, రూ.26 వేల కోట్లతో హెచ్పీసీఎల్ విస్తరణ ప్రారంభం కానుంది. 
గంభీరంలో నిర్మించిన ఐఐఎం(వైజాగ్)భవనానికి శ్రీకారం. రూ.380 కోట్లతో ఈఎస్ఐ ఆస్పత్రికి శంకుస్థాపన కూడా చేయనున్నారు. 

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam