DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయ్యన్న 2 సెంట్ల భూమి ఆక్రమించారు, ఏఈ ఫిర్యాదు మేరకు అరెస్ట్ 

*(DNS Report: P Raja, Burau Chief, Amaravati)*    

*అమరావతి, నవంబర్ 03, 2022 (డి ఎన్ ఎస్ )* చింతకాయల  అయ్యన్నపాత్రుడు ఫోర్జరీ సంతకాలతో 2 సెంట్ల భూమిని అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు ఆక్రమించారని అందుకే అరెస్ట్ చేసినట్టు సిఐడి డీఐజీ సునీల్ కుమార్ నాయక్ మీడియా కు వివరించారు. మంగళగిరి లోని సి ఐడి కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో

నిర్వహించారు. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ నీటిపారుదల శాఖ కు సంబంధించిన ఏక్సిక్యూటివ్ ఇంజినీర్ సెప్టెంబర్ 13 న ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతకాయల అయ్యన్నపాత్రుడు, విజయ్, రాజేష్ లపై ఫోర్జరీ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకాలతో 2 సెంట్ల భూమిని అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు ఆక్రమించారని పిర్యాదులో ఉందన్నారు.

ఏక్సిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి అధికారితో బలవంతంగా అటెస్టేషన్ చేయించారని తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసామని డిఐజి సునీల్ కుమార్ నాయక్ స్పష్టంచేశారు. ఎన్ఓసీపై ఏఈ సంతకంతో పాటు సదరు ఇంజినీర్ పనిచేస్తున్న కార్యాలయ సీల్ కూడా నకిలీదేనని విచారణ తేలిందన్నారు. 

ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు,

అతని కుమారులపై ఐపీసీ 464, 467, 471, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున అయ్యన్న పాత్రుడు అతని కుమారుడు రాజేష్ లను అరెస్ట్ చేశామని సిఐడి డీఐజి సునీల్ కుమార్ నాయక్ స్పష్టంచేశారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులకు సహకరించని వారిని బలవంతంగా అరెస్ట్ చేసే అధికారం తమకు ఉందని తెలిపారు.

అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు వ్యతిరేకంగా ప్రవర్తించారని..ఆ క్రమంలో బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ అధికారి ఇచ్చిన పిర్యాదు మేరకు చట్టప్రకారంగానే చర్య తీసుకున్నామని డిఐజీ సునీల్ కుమార్ నాయక్ ప్రెస్ మీట్ లో తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam