DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ సాధన  శ్రమ బీజేపీ ది, విజయం చేరేది వైకాపా ఖాతాలోకేనా 

*బీజేపీ నేత సభ కి భారీ జనసమీకరణ చేసేది వైకాపాయే..క్రెడిట్ కొట్టేది కూడా వాళ్ళే*

*Amaravati, Nov 07, 2022 (DNS Online) :*
    
*అమరావతి, నవంబర్ 07, 2022 (డిఎన్ఎస్):*  ఈ నెల 11 న విశాఖ  రానున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇదే వేదిక పై నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైల్వే

జోన్ సాధన కోసం, ప్రధాని విశాఖ పర్యటన కోసం పూర్తి స్థాయిలో కష్టపడింది భారతీయ జనతా పార్టీ యే. అయితే ఈ అయన ప్రకటించే రైల్వే జోన్ సాధన మాత్రం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరుతోంది. దీనికోసం వైకాపా ఏమాత్రం కష్టపడకుండానే ఈ ఫలితం రానుంది. దీనికి ప్రధాన కారణం ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ కి బొత్తిగా జనం లేకపోవడం

కావచ్చు. ఈ నెల 12 న విశాఖ లోని ఎయు మైదానం వేదికగా ప్రధాని పలు ప్రారంభోత్సవాలు, రైల్వే జోన్ ప్రకటన చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనికోసం భారీ ఎత్తున జన సమీకరణ చేయాల్సిన భాద్యత బీజేపీ పై ఉండగా, ఈ దిశగా నేతలు ఏమాత్రం దృష్టి పెట్టకపోగా అధికార వైకాపా మాత్రం పూర్తి స్థాయిలో మోడీ దృష్టిని ఆకర్షించేందుకు సుమారు

లక్ష మంది తో జన సమీకరణ చేసేందుకు పూర్తి యంత్రాంగాన్ని వినియోగిస్తోంది. బీజేపీ కి చెందిన నరేంద్ర మోడీ ప్రారంభోత్సవాలు, ప్రసంగించే చేసే సభలో కాషాయ జండాలకు బదులుగా వైకాపా జండాలు రెపరెపలాడించేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి రంగం లోకి దిగుతున్నట్టు సమాచారం. 
బీజేపీ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న బలం చూస్తే. .ఈ సభతో పాటు,

రైల్వే జోన్ ప్రకటన విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు వైకాపా పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా కనపడడం లేదు. 
ఒక రకంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరువు కాపాడాలంటే ఈ సభ ను విజయం చేసేందుకు బీజేపీ తప్పనిసరిగా వైకాపా ను ప్రాధేయపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ నేతలు చేసే జన సమీకరణలో ఎయు మైదానంలో కనీసం రెండు లైన్లు కూడా

నిండే అవకాశం ఉండదు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ పరువు నిలబడాలి అంటే వైకాపా మద్దతు తప్పనిసరి. ఏరకంగా చూసుకున్న ఈ సభ లో జన సమీకరణలో పాటు, రైల్వే జోన్ సాధన విజయం కూడా  వైకాపా ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనపడుతోంది. 

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. . ప్రధాని సభా ప్రాంగణంలోకి ఎంపీ జివిఎల్ నరసింహారావు,

ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ లను తప్ప ఇతర బీజేపీ నేతలను రానిస్తారా అనేది కూడా సందేహంగానే ఉంది. అదే జరిగితే ఆంధ్ర లో బీజేపీ పూర్తి గా భూస్థాపితం అయ్యేందుకు స్వయంకృతాపరాధం కారణం అవుతుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam