DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చక జీతం పెంపు జీవో ఒకే. . అసలు ఈ వేతన జీవో అమలుకు నోచుకుంటుందా?

*కనీసం రూ. 10 వేలు,  ఆపై రూ. 15,625  పెంచమని కమిషనర్ ప్రకటన*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, నవంబర్ 12, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ శాఖా పరిధిలోని దేవాలయాల్లో అల్పాదాయం పొందుతున్న అర్చకులకు వేతన సవరణ చేస్తూ ఏపీ దేవాదాయ శాఖా కమిషనర్ హరి జవహర్ లాల్ ఒక జీవో ను

విడుదల చేసారు. అయితే ఈ జీవో విడుదల పట్ల అర్చక సంఘాల ప్రతినిధులు  పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా అర్చకుల పట్ల సరైన సంస్కృతి పాటించని దేవాదాయశాఖ అసలు ఈ జీవో ను అమలు చేస్తుందా లేదా కూడా ప్రకటించలేదని మండిపడుతున్నాయి. ఈ జీవో 2021 లోనే విడుదల చేసినట్టు తెలుస్తున్నా. . అసలు ఇప్పడి నుంచి అమలు చేస్తారు

అనే విషయం మాత్రం చెప్పలేదు. గతంలోనూ, ప్రస్తుతం ప్రభుత్వాలు అర్చకుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశాయని, వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటె తక్షణం ఈ జీవో ను అమలులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాయి. 

ఈ జీవో ప్రకారం ఇంతవరకు  రూ. 10,000 జీతం పొందుతున్న అర్చకులకు రూ.15,625  పెరుగుతుంది. అదే విధంగా రూ. 5000 కంటే

తక్కువ వేతనం పొందుతున్న అర్చకులకు 10 వేల రూపాయలు వేతనం ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేసారు. ఈ జీవో సరిగ్గా అమలు జరిగితే చాలామంది అర్చక కుటుంబాల్లో జీవన విధానం మెరుగు పడుతుంది. ఇన్నాళ్లు అరకొర ఆదాయంతో ఎదో జీవితాన్ని వెళ్లదీస్తున్న వీళ్ళకి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం దేవాదాయ శాఖా పరిధిలోని ఆలయాల్లో రూ. 5000 కంటే

తక్కువ జీతం పొందుతున్న అర్చకులు సుమారు 5000 మందికి పైగా ఉన్నట్టు సమాచారం. వీరిలో కనీసం నెల జీతం కూడా రాని అర్చకులు వందల్లోనే ఉన్నారు. రూ. 10 వేలు తీసుకునే వాళ్ళు సుమారు వెయ్యి మంది కి పైగా ఉంటారు. మొత్తం  అర్చకులు: 20000 మంది ఉంటారు. వీళ్ళలో లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కించుకుంటారో తెలియాల్సి ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam