DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రొయ్యల ఎగుమతులలో సమస్యలు పరిష్కరించాలి: ఎగుమతి దారుల సంఘం

*(DNS Report: P Raja, Burau Chief, Amaravati)*    

*అమరావతి, నవంబర్ 15, 2022 (DNS Online) :* అంతర్జాతీయంగా రొయ్యల ఎగుమతుల  సమస్యలతో నష్టాలబాటలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రొయ్యల ఎగుమతి దారుల సంఘం సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రసంఘ అధ్యక్షుడు అల్లూరి ఇంద్ర కుమార్, ప్రధానకార్యదర్శి గుంటూరు పవన్ సంయుక్తంగా విడుదల చేసిన

పత్రికప్రకటన ద్వారా అనేక సమస్యలను రొయ్యల రైతుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని తెలియజేశారు. రొయ్యల ఎగుమతులలో ప్రతిరోజు కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని అంతర్జాతీయ రొయ్యల ఎగుమతులలో కొత్తనిబంధనలవల్ల రొయ్యల ఎగుమతికి ఆటంకంగామారి ఎగుమతులు నిలిచిపోయి ఆర్థికంగా నష్టపోతున్నామన్నారు.ముఖ్యంగా ఆక్వా రైతులకు మేలు

చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న విధాన నిర్ణయాలకు మావంతు సహకారం అందిస్తున్నామని అదే విధంగా మాకుఎదురైన సమస్యలను పరిష్కరించాలని కోరారు.
భారతదేశము నుండి అత్యధికంగా అమెరికా యూరప్ చైనాదేశాలకి రొయ్యల ఎగుమతులు అవుతుండగా ప్రస్తుతం అయాదేశాల్లో అనేక మార్పులుచోటు చేసుకున్నందున ఎగుమతులు

మందగించాయన్నారు. 
 అమెరికా సమీపంలో ఈక్విడర్ ప్రాంతం నుండి రొయ్యల ఉత్పత్తి అధికంగా పెరగడంవల్ల అమెరికా, యూరప్ దేశాలకి సులువుగా ఎగుమతులు అవుతున్నాయి.
 అక్కడి దేశాల ప్రభుత్వాలు ఆక్వా రైతులకు ప్రోత్సాహాకలు, రాయితీలుఇచ్చి సాగు, ఎగుమతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో  ఈక్విడార్లోని రొయ్యలు తక్కువ ధరలకే

లభ్యమవుతున్నాయని తెలిపారు.
  భారతదేశమునకు రెండవ అతిపెద్ద మార్కెట్ గాఉన్న చైనా బాగాచిన్న, మధ్యాస్తంగా ఉండే సైజు రొయ్యలను కొనుగోలులను కోవిడ్  సంక్షోభం అనంతరం గతరెండు నేలలుగా మన ఉత్పత్తులను నిలిపివేసినందున భారత వాణిజ్య మంత్రిత్వశాఖ,ఎంపెడా, జి.ఏ.సి.సి ఆడిట్ నిర్వహించి నివేదిక పంపిన చైనా విధించిన నిబంధనలను

సడలించలేదు.
 ఈఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు ఇక్కడ రైతులకు మంచి ధరలు లభించిన చైనా దిగుమతి సంస్థలు మన ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసి భారతదేశ దిగుమతులకు సంక్షోభం  సృష్టించి ఈక్వేడర్, వియత్నం, ఇండోనేషియా  దేశాలలో అధికంగా రొయ్యలు తక్కువ ధరలకు లభించడంవల్ల వారి ఉత్పత్తులకు అత్యధికంగా దిగుమతి

చేసుకుంటున్నారు.
 భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతి సంఘం ఆధ్వర్యంలో పలునిబంధనలకు లోబడి మేము వ్యాపారం చేయాల్సి ఉండగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఆధ్వర్యంలో ఆక్వా పరిశ్రమలు రొయ్య రైతుల సంఘ  ప్రతినిధులతో అమరావతిలో నవంబర్ 10వ తేదీన నిర్వహించిన సమావేశంలో కమిటీ సూచనల మేరకు పది రోజులకు నిర్ణయించిన ధరలు

మాకు భారమైన అనేక ఇబ్బందులతో రొయ్యల కొనుగోలుచేస్తు ముందుకు సాగుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రొయ్యల రైతులకు లభించే ధరలు 100 కౌంట్ రొయ్య ధర రూ 210,  90 కౌంట్ రొయ్య ధర రూ 220,  80 కౌంట్ రొయ్య ధర రూ 240,  70 కౌంట్ రొయ్య ధర రూ 250, 60 కౌంట్ రొయ్య ధర రూ 270,  50 కౌంట్ రొయ్య ధర రూ 290,  40 కౌంట్ రోయ్య ధర 340, 30  కౌంట్ రొయ్య ధర రూ 380, ధరలు చెల్లింపులు

జరుగుచున్నందున అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఎగుమతి దారుల సమస్యలను,ఇబ్బందులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేసే దిశగా  రొయ్యల రైతులు సహాయ సహకారాలు అందించాలని ఏపీ రొయ్యల ఎగుమతి దారుల సంఘం కోరింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam