DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ చేసిన విశాఖ రాజధాని ప్రకటనపై మండిపడ్డ బీజేపీ నేతలు 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జనవరి 31, 2023 (డిఎన్ఎస్):* విశాఖపట్నమే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అంటూ దేశ రాజధాని వేదికగా ముఖ్యమంత్త్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన పై భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

సోమువీర్రాజు మాట్లాడుతూ అమరావతి రాజధాని ఇదే విషయం అనేక సందర్భాల్లో స్పష్టం చేశాం అన్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు జగన్ అమరావతి లో నే రాజధాని అని ఇల్లు కట్టుకుని ఇప్పుడు విశాఖ అంటే రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు.  అయితే బిజెపి అమరావతి రాజధాని కి కట్టుబడి ఉందని సోము వీర్రాజు స్పష్టం

చేశారు*

విశాఖ అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం తో వేగవంతంగా అభివృద్ధి చెందుతోందన్నారు
రాష్ట్రంలో రాజకీయాలు పెడత్రోవ పడుతున్నాయని సోము వీర్రాజు మండి పడ్డారు.

రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణ లో ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రకటన చేయడం హాస్యాస్పదం అని

బీజేపీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. ఢిల్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజధాని పట్ల చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. అమరావతి మన రాష్ట్ర రాజధానిగా ఉండాలనే ప్రజల ఆకాంక్షే నెరవేరుతుందన్నారు 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam