DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బొగ్గవరపు సత్రం భూములు కాపాడక పొతే. .పేదలకు పంచేస్తాం: సిపిఐ

*కబ్జాకు గురైన దాతల విరాళ భూములపై కలెక్టర్ కు సిపిఐ వెల్లడి* 

*(DNS Report: P Raja, Burau Chief, Amaravati)*    

*అమరావతి, ఫిబ్రవరి 01 , 2023 (DNS Online) :*  కాకినాడ జిల్లాలో, కాకినాడ రూరల్ లో ప్రజా సంక్షేమం కోసం దాతలు ఇచ్చిన బొగ్గవరపు సత్రం భూములను దేవస్థానం భూములు రాజకీయ ప్రతినిధులు అధికారులతో కలిపి కబ్జా చేయడంపై సిపిఐ కాకినాడ

జిల్లా కమిటీ తీవ్రంగా స్పందించింది. ఇటీవల కాకినాడ రూరల్ లో బొగ్గవరపు సత్రం భూములు అన్యక్రాంతం కావడం కోట్లాది రూపాయలు విలువైన భూములను రాజకీయ అండదండలతో కబ్జా చేసినట్టు వెలుగు లోకి రావడంతో సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ బృందం తాటిపాక మధు, కే. రెడ్డి బోడకొండ, తోకల ప్రసాద్, పి. సత్యనారాయణ, కోమర్తి శ్రీనివాస్ కలెక్టర్ శుక్ల

ను కలిసి వినతి పత్రం అందచేశారు.
ఈ సందర్భంగా మధు కలెక్టర్ కు వివరిస్తూ 40 సంవత్సరాల ముందు నుండి సిపిఐ పార్టీ సర్పవరం ప్రాంతాలలో రైతులకు భూములను పంపిణీ చేసిందని, రైతుల కోసం పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు. సర్పవరంలో 49/1 ఎకరం భూమిని దేవదయ అధికారులు ఒక వ్యక్తికి అప్పనంగా అప్పజెప్పారన్నారు. 35 సర్వే నెంబరు రైతు వారి

భూమి తో పాటు బొగ్గవరపు సత్రం భూమి కూడా ఉందని ఆయన వివరించారు. కోట్లాది రూపాయలు విలువైన భూమిని చాలా చౌక గా రాజకీయ నాయకులు బినామీ పేరుతో కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 

కలెక్టర్ మాట్లాడుతూ ఈ భూమి వ్యవహారాలపై ఆర్డిఓ తో పూర్తిస్థాయి విచారణ చేయిస్తానని, దానికి అందరూ సహకరించాలని ఆమె

అన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam