DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఖేలొ ఇండియా జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో వేదాంత్ మాధవన్ కు 5 గోల్డ్ మెడల్స్

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*Visakhapatnam, Feb 20 2023 (DNS Online ):* ఈ నెల 12 న మధ్యప్రదేశ్ లో జరిగిన ఖేలో
 ఇండియా యూత్ గేమ్స్‌లో స్విమ్మింగ్ పోటీల్లో వేదాంత్ మాధవన్ అత్యద్భుతమైన ప్రదర్శన చూపి 5 బంగారు పతకాలు, 2 రజత పతకాలు సాధించాడు. ఇతను దక్షిణాదికి చెందిన ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు ఆర్ మాధవన్ కుమారుడు కావడం

గమనార్హం. తన కుమారుడి విజయాన్ని మాధవన్ సోషల్ మీడియా ఖాతాద్వారా పంచుకున్నాడు. 
వేదాంత్ మాధవన్ అద్భుతమైన ప్రదర్శన చూపి ఐదు బంగారు పతకాలు సాధించి సంచలనం సృష్టించాడు.  మొత్తంగా వేదాంత్ 5 బంగారు, 2 రజత పతకాలతో కలిపి 7 పతకాలను కైవసం చేసుకున్నాడు. 

మహారాష్ట్ర తరపున పోటీల్లో పాల్గొన్న వేదాంత్  గెలుచుకున్న

పతకాలు ఇవే.. .100 మీటర్లు , 200 మీటర్లు, 1500 మీటర్లు ల్లో స్వర్ణం, 400 మీటర్లు, 800 మీటర్లు ల్లో రజతం సాధించాడు. 

వేదాంత్ మాధవన్ భవిష్యత్ లో భారత్ తరపున అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాలని అభిమానులు అభిలషిస్తున్నారు. ఇదే పోటీల్లో ఫెర్నాండెజ్ అపేక్ష (6 స్వర్ణాలు, 1 రజతం, PB $ రికార్డ్‌లు) కు అభినందనలు

తెలిపారు. 

ఆర్ మాధవన్ కొడుకు గురించి మాట్లాడుతూ, అతను భారతదేశానికి అత్యంత అభివృద్ధి చెందుతున్న స్విమ్మర్‌లలో ఒకడు మరియు అనేక సందర్భాల్లో దేశం గర్వించేలా చేశాడు.

మేము ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 లో మహారాష్ట్ర వరుసగా మూడవ టైటిల్‌ను గెలుచుకుంది.మొత్తం 56 బంగారు పతకాలతో సహా 161 పతకాలను

గెలుచుకుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam