DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాయవరం వద్ద లారీ - బస్సు ఢీ,  రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2023 (డిఎన్ఎస్):* నూతన అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం ధర్మవరం వద్ద శుక్రవారం బస్సు ప్రమాదం జరిగింది. అనకాపల్లి  నుండి తుని వైపు వెళ్తున్న ఏపీఎస్ ఆర్.టి.సి బస్సును అదే మార్గంలో వెళ్తున్న పంజాబీ లారీ బస్సును వెనుక నుండి బలంగా ఢీకొనడంతో ఆ

బస్సు ముందున్న ఆటో ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విశాఖపట్నం ఇసుకతోట కు చెందిన మడపల్లి వీరయ్య (50 ) మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్.టి.సి బస్సులో ప్రయాణిస్తున్న 48 మంది ప్రయాణికులకు గాను 25 మంది కి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్.ఐ ప్రసాదరావు గాయాలపాలైన వారిని తమ చేతుల మీదుగా

ఎత్తుకొని 108 లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నక్కపల్లి ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. ఎస్.రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam