DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోకో పైలట్ల పై పనికిరాని ఒత్తిడి తేవద్దు:దమ రైల్వే డ్రైవర్లు మండిపాటు

*డ్రైవింగ్ చేసే పైలట్లకు స్టేషన్ల డ్రాయింగ్ తో పనేంటి?: లోకో పైలట్లు*  

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*
   
*అమరావతి, మార్చ్ 02 , 2023 (డి ఎన్ ఎస్ ): రైల్వే డ్రైవర్ల (లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు) పై రైల్వే అధికారులు చేస్తున్నఅనవసరపు  ఒత్తిళ్లు తక్షణం విరమించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే డ్రైవర్లు జెఏసి

ఆధ్వర్యవం లో డిమాండ్ చేస్తున్నారు. ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సిగ్నల్ పాయింట్లను డ్రాయింగ్ గీసి ఇమ్మని అడగడం ఏంటని జెఏసి నేతలు  ప్రశ్నిస్తున్నారు. అనవసరం లేనప్పడికి అసిస్టెంట్ లోకో పైలట్లు ప్రతి స్టేషన్ లోనూ వంగుని, సిగ్నల్ చూపించడం వాళ్ళ నడుం నెప్పులు వస్తున్నాయన్నారు. 

గురువారం

రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లోని రైల్వే ఇనిస్టిట్యూట్‌లో వివిధ రైల్వే సంఘాల జేఏసీ నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు.

నేతలు మాట్లాడుతూ  రైల్వే కు ఆదాయం తీసుకు వచ్చే విభాగమే రైళ్లని, ఈ రైళ్ల ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం, కొన్నివేల టన్నుల

సరుకుని సురక్షితంగా రవాణా చేస్తున్న లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లు ప్రశాంతంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటిది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలట్ల పై రైల్వే అధికారుల ఒత్తిళ్లు తీవ్రమైపోయాయన్నారు. ఇదే అంశం పై గత వారం  ధర్నా కూడా చేయడం జరిగిందన్నారు.

దేశ వ్యాప్తంగా 1 లక్ష 25 వెల మంది

లోకో డ్రైవర్లు ఉన్నారని, దక్షిణ మధ్య రైల్వే లో sumaru 3 వేళా మంది లోకో పైలట్ లు, సహాయ పైలట్ లు ఉన్నారన్నారు.  

మనశాంతిగా చేయాల్సిన వర్క్ ని వత్తిడిపెంచి చేయించడం వలన ప్రమాదాలు పొంచి వుంటాయన్నారు.  సంబంధం లేని అంశాల్లో తమను బాధ్యులుగా చేస్తూ ప్రశాంతత లేకుండా చేస్తున్నారని వాపోయారు. దీనివలన ఇళ్లల్లో కూడా

కుటుంబ సభ్యులు మనశాంతి కోల్పోతున్నారని వారు పేర్కొన్నారు. 

కౌన్సిలింగ్, సెమినార్ల పేరిట పదిమందిలో పిలిచి అవమానించడం వంటివి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి చర్యల వలన ఒక లోకోపైలేట్ ఆత్మహత్య అనే ఆలోచనకు వెళ్లడం బాధ కల్గించిందని, అందుకే ఇలాంటి సంఘటనలు జరగకూడదన్న ఉద్దేశ్యంతో జాయింట్ యాక్షన్

కమిటీగా ఏర్పడినట్లు వివరించారు. కొత్త కొత్త రైళ్లు ప్రవేశపెడుతూ అందుకు అనుగుణంగా ప్రస్తుత లోకో పైలెట్లను పనిచేయమనడం సరికాదని, ఐఐటి ద్వారానో మరో సంస్థ ద్వారానో కొత్తవాళ్లను కొత్త రైళ్లకు తీసుకోవాలని వారు కోరారు. శాస్త్రీయ పద్దతిలో రైల్వే బోర్డు యోచన చేయాలన్నారు. లేదంటే ఇప్పుడున్న వారిపై వత్తిడి పెంచితే

ఇబ్బందులు వస్తాయన్నారు.

ఈ సమావేశంలో డిఎమ్ ఆర్ కె ఎస్ జోనల్ సెక్రటరీ కెవి  ఉన్నికృష్ణన్, ఏ ఐ ఎల్ ఆర్ ఎస్ ఏ ఆర్గనైజేషన్ సెక్రటరీ కె రవిశంకర్, ఎస్ సి ఆర్ ఈ ఎస్, సెక్రటరీ జెడి ప్రసాద్, ఎస్ సి ఆర్ ఎం యు రాజమండ్రి సెక్రటరీ కెటి దేవ్ ఏ ఐ ఎల్ ఆర్ ఎస్ ఏ ప్రెసిడెంట్ బి సి ఎస్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జె విజయకుమార్, ఓబిసి

అసోసియేషన్ పి రామం, ఏ ఐ ఎల్  ఆర్  ఎస్ ఏ సెక్రటరీ కెవి ఆర్ కె రాజు, సి ఐ టి యు సెక్రటరీ పూర్ణిమరాజు, ఏ ఐ ఎస్ సి,ఎస్ టి అసోసియేషన్ ప్రతినిధి పి.సూర్యనారాయణ, ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం, మజ్దూర్ సంఘం, అల్ ఇండియా లోకో రన్ స్టాఫ్ సంఘం, డిఎంఆర్ కె ఎస్, తదితర సంఘాల ప్రతినిధులు, రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులు

తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam