DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వం భాధ్యత గుర్తుచేసేందుకే ఈ నెల 9 నుంచి ఉద్యమం: బొప్పరాజు

*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు సెల్ డౌన్: అమరావతి జెఏసి*   

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार )*

*విశాఖపట్నం, మార్చి 06 , 2023 (డిఎన్ఎస్):* ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించినందుకే 
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉద్యోగులు ఒక్కరోజు సెల్ ఫోన్ డౌన్ చేస్తున్నట్టు ఏపీ జెఏసి అమరావతి

అధ్యక్షులు బోప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. సోమవారం విశాఖ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉద్యమానికి ఏపీసిఎస్సిఏ సంఘం కూడా మద్దతు ఇస్తోందన్నారు. 

గత 4 ఏళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరినీ ప్రశ్నిస్తూ ఈ

నిరసన ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వక పోవడం, చట్ట ప్రకారం 11 వ PrC ద్వారా రావాల్సిన మొత్తం పై స్పష్టం లేదు, పే స్కేల్స్ లేవన్నారు. 

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యోగులు, పోలీసులకు సరెండర్ సెలవులు కూడా లేవన్నారు. ఉద్యోగులు విధుల్లో భాగంగా బిల్లులు పెట్టుకుంటే

చెల్లింపులు లేవన్నారు. జనరల్ ప్రోవిడెంట్ ఫండ్ దాచుకుంటే ఆ డబ్బులు కూడా చెల్లించడం లేదన్నారు. సుమారు 3000 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. .

Cps రద్దు చేస్తాం అన్నారని, పాత పెన్షన్ అమలు లేదన్నారు. దీని పరిశీలనా కోసం జిపిఎస్ సంఘాన్ని రాజస్థాన్ కు తీసుకువెళ్లారన్నారు. పాత పెన్షన్ విధానం అమలు చేస్తాం

అన్నారు. అదిలేదు.  అసలు ఈ పర్యటన ఎందుకు చేసినట్టు చెప్పాలన్నారు. 

కేవలం 5 ఏళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ గా ఉండే రాజకీయ నాయకులు ఎందుకు పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. వీళ్ళ పెన్షన్లను ఎందుకు రద్దు చెయ్యరన్నారు. వీళ్ళకి ఇచ్చే రాయితీలు ఇంకెవ్వరికి లేవన్నారు.

ఈ సమావేశంలో వివిధ సంఘాలకు

చెందిన నేతలు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam