DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజావాణి వినిపించడానికి ఇంత ప్రెస్టీజ్ అవసరమా?: అజ శర్మ

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार )*

*విశాఖపట్నం, మార్చి 07 , 2023 (డిఎన్ఎస్):* చట్ట సభలో ప్రజావాణి వినిపించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు ప్రెస్టీజ్ కి వెళ్తున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి సమాఖ్య కన్వీనర్ అజ శర్మ ఆవేదన వ్యక్తం చేసారు. మంగళవారం DNS తో మాట్లాడుతూ ఈ నెల 13 న జరుగనున్న ఉత్తరాంద్ర జిల్లాల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు ప్రెస్టీజ్ కి వెళ్తున్నారని, దానికోసం తప్పటడుగులు కూడా వేసేందుకు  వెనకాడడం లేదన్నారు. రాజ్యాంగం ఇచ్చిన సూచనలు ప్రకారం ప్రజల నుంచి చట్ట సభలకు ఎన్నికయ్యేందుకు కేవలం కొన్ని స్థానాలే పరిమితం అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ చట్ట సభల ప్రకారం ఎమ్మెల్యే లు, ఎంపీ సీట్లకు రాజకీయ

 పార్టీల ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది, వీటికి అతీతంగా శాసన మండలి లో మాత్రం  10 స్థానాల్లో నేరుగా ప్రజల నుంచి ఎన్నికైన వారికి (రాజకీయ పార్టీల అతీతంగా) కేటాయించారన్నారు.  ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పట్టభద్రుల నియోజక వర్గం నుంచి గెలిచే అభ్యర్థులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న

సమస్యలను సభలో వినిపించాలన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విశాఖ రైల్వే  జోన్ తదితర అంశాలు కేంద్ర పరిధిలో ఉన్నప్పడికి రాష్ట్ర చట్ట సభలో చర్చించి, తీర్మానం చేయించవలసిన భాద్యత సభ్యులపై ఉంటుందన్నారు. అదే రాజకీయ పార్టీలే నేరుగా రంగం లోకి దిగడం సరికాదన్నారు. 
ఈ ఎన్నికలు అభ్యర్థులు వ్యక్తిగతంగా పోటీ

చెయ్యాలె తప్ప, పార్టీల గుర్తుపై ఎన్నిక ఉండదన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam