DNS Media | Latest News, Breaking News And Update In Telugu

2736 కొత్త బ‌స్సులు కొనుగోలుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణ‌యం

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार)*    

*విశాఖపట్నం, మార్చి 08 , 2023 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ సొంతంగా 2736 కొత్త బ‌స్సులు కొనుగోలు చెయ్యడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గ్రీన్‌ సిగ్న‌ల్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమ‌ల‌రావు తెలిపారు. ఇటీవల విజయవాడ లోని

సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రూ. 572 కోట్ల అంచ‌నాతో 1500 కొత్త డీజిల్ బ‌స్సులు, జీసీసీ మోడ‌ల్‌లో 1000 ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సులు కొనుగోలు చెయ్యడంతో పాటు, 200 డీజిల్ బ‌స్సుల‌ను ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సులుగా మార్పు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. క‌ర్ణాట‌క త‌ర‌హాలో 15 మీట‌ర్ల

అంబానీ బ‌స్సులు కూడా అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ మేరకు త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాల‌తో త్వ‌ర‌లోనే ఒప్పందాలు కూడా చేసుకోనున్నట్టు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam