DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిఎం ఓటు వేస్తున్నారా లేదా? బీజేపీ సూటిప్రశ్న

*కేంద్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ జయ ప్రకాష్ నారాయణ డిమాండ్* 

*(DNS Report: Reddy G, reporter, Visakhapatnam)*    

*విశాఖ పట్నం, మార్చి 10, 2023 ( డిఎన్ఎస్):* ప్రస్తుతం జరుగుతున్న కడప ఎమ్మెల్సీ ( పట్టభద్రుల)  ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఓటు వేస్తున్నారా లేదో చెప్పాలని కేంద్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ జయ ప్రకాష్ నారాయణ

డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చట్ట సభ కు జరుగుతున్నఎన్నికల్లో మొదటి ఓటు అయన వేసి, ప్రజలను కూడా ఓటు వేసేలా స్ఫూర్తి కల్గించాల్సి ఉందన్నారు. అయితే ఇంతకీ ఆయనకి ఓటు హక్కు ఉందా లేదా అనే విషయం బహిర్గతం చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వెయ్యాలి అంటే కనీసం డిగ్రీ పూర్తి

చేయాలని, అది కనీస  అర్హత అన్నారు. ఆ అర్హత ఉందా లేదా చెప్పాలన్నారు. అదే విధంగా ఇతర పార్టీల నేతలు కూడా తమ ఓటు హక్కును ప్రకటించాలన్నారు. ఈ ఎమ్మెల్సీ ( గ్రాడ్యుయేట్స్)  ఎన్నికల్లో డిగ్రీ లేని వారికి కూడా ఓట్లు నమోదు చేశారు అని ఆరోపించారు. 

కోర్టు లో కేసులు వున్నా సీఎం జగన్ రాజధాని ప్రకటన చేయడం విడ్డూరం గా

వుందన్నారు. గిరిజన, పెట్రో కెమికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం సహకారం ఇస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సమర్ధంగా పని చేస్తోందన్నారు. రూ.10 వేల కోట్లతో జెట్టెల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఏపీ కి కేంద్రం ఇతోధికంగా నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. రూ.30 వేల కోట్లతో జాతీయ రహదారుల

అభివృద్ధి జరిగింది అన్నారు.  
తెలుగుదేశం పార్టీ నీతులు చెబుతూ, కమ్యూనిస్టులు, జనసేనతో పొత్తు అనడం విడ్డూరం గా వుంది అన్నారు. ప్రజలు టీడీపీ ఉనికి లేకుండా చేస్తారు అన్నారు. 

బీజేపీ  రాష్ట్ర ఉపాధ్యక్షులు పీ. విష్ణు కుమార్ రాజు, మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారంలో వలంటీర్ లను ఉపయోగిస్తే కలెక్టర్

చర్యలు తీసుకోవాలి అని కోరారు. పోలీసులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరింత నిఘా పెట్టాలి అని కోరారు. 

యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, తేదేపా పీడీఎఫ్ మధ్య అక్రమ సంభంధం ఏమిటని ప్రశ్నించారు. బషీర్ బాగ్ కాల్పులు, గుర్రాలతో తొక్కించిన అందుకా టీ డీ పీ కి ప్రాధాన్యత ఓటు అడుగు తున్నారు అని

కమ్యూనిస్టులను ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఈ పార్టీలు ఓట్లు కొనడం, అక్రమ పొత్తులు చేస్తున్న పార్టీలకు పట్ట భద్రులు బుద్ది చెప్పాలి అని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam