DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణులను గుర్తించినవారికి ధన్యవాదం తెలిపే సమయం ఇదే

*ఏఐబిఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ద్రోణం రాజు రవికుమార్ పిలుపు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार )*

*విశాఖపట్నం, మార్చి 11, 2023 (డిఎన్ఎస్):* బ్రాహ్మణులకు తగిన గుర్తింపు ఇచ్చిన వారికీ ధన్యవాదములు తెలిపే సమయం, అవకాశం ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో వచ్చిందని  ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు

ద్రోణం రాజు రవికుమార్ బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు. 
శనివారం విశాఖ నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 13 న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బ్రాహ్మణులను గుర్తించిన వైసీపీ పార్టీ మద్దతు ప్రకటించిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో సీతంరాజు

సుధాకర్ కి 1 వ ప్రాధాన్యతా ఓట్లు వేసి గెలిపించాలని బ్రాహ్మణ జాతిని అభ్యర్థించారు.

గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మూడు శాసనసభ స్థానాలను బ్రాహ్మణ సామాజిక వర్గానికి కేటాయించిందని గుర్తు చేశారు. 35 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క MLA, MLC సీట్లు కేటాయించలేదన్నారు, బ్రాహ్మణ

జాతిని ఓట్ బ్యాంకుగా వాడుకొని కరివేపాకుల తీసివేశారన్నారు, జరుగుతున్న గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా టీడీపీ పార్టీ బ్రాహ్మణులకు మొండి చేయి చూపించారు అని ఎద్దేవాచేశారు.

2019  ప్రభుత్వం లోకి వచ్చిన వెంటనే 32 సంవత్సరాలుగా అర్చకులు పోరాడుతున్న వంశపారం పర్య అర్చకత్వంకు  జీవో 439 విడుదల చేసి

అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. నవరత్న పథకాలలో బ్రాహ్మణులు లబ్ది పొందుతున్నారని, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమయంలో బ్రాహ్మణుల పైన కపట ప్రేమ వలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఈబీసీ నేస్తం ద్వారా నిరుపేద బ్రాహ్మణ మహిళలు ప్రతి ఏడాది 15 వేల రూపాయలు చొప్పున 30 వేల మంది

బ్రాహ్మణ మహిళలు లబ్ది చేకూరుతుందని తెలిపారు.ప్రతి నెలా 1 వ తేధీన వై ఎస్ ఆర్ ఫించన్ కానుక ద్వారా నేరుగా 40 వేల మంది బ్రాహ్మణులకు  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఫించన్ అందిస్తున్నారు అని తెలిపారు.

ఎన్నో ఏళ్లుగా అర్చకులు చాలి చాలని జీతాలతో బతుకుతున్న సమయంలో అర్చకుల బాధలను గుర్తించి రూ. 10 వేలు జీతం ఉన్న

వారికి రూ. 16 వేలు, రూ. 5 వేలు జీతం ఉన్నవారికి రూ. 10 వేలు జీతాలు పెంచి అర్చకుల వృదాయాలలో చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలపర్చిన సీతంరాజు సుధాకర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓట్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీడియా సమావేశంద్వారా పిలుపునిచ్చారు. 

ఈ విలేకరుల ఆంధ్రప్రదేశ్

బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (ఏఐపిబిఎసెసెస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ, (ఏఐపిబిఎసెసెస్) రాష్ట్ర కోశాధికారి హెచ్ కె మనోహర్ రావు, రాష్ట్ర మహిళా విభాగం సంయుక్త కార్యదర్శి మండ గౌరీ లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కలగ  ప్రభాకరం, ఒడియా బ్రాహ్మణ సంఘం ప్రతినిధి, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam