DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మార్చ్ 12 న ఎమ్మెల్సీ అభ్యర్థులతో విశాఖలో బహిరంగ చర్చ - ముఖాముఖి

*ఉత్తరాంధ్ర విద్యావంతుల వేదిక నిర్వహణలో విశాఖలో బృహత్తర కార్యాచరణ*  

*(DNS Report: Reddy G, reporter, Visakhapatnam)*    

*విశాఖ పట్నం, మార్చ్ 11, 2023 ( డి ఎన్ ఎస్) :* ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం శాసన మండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులతో ముఖాముఖి ( Open Debate ) నిర్వహిస్తున్నట్టు ఉత్తరాంధ్ర విద్యావంతుల

వేదిక కన్వీనర్ ఆడారి కిషోర్ కుమార్ తెలియచేశారు. 
 శనివారం విశాఖ పట్నం లోని ద్వారకా నగర్ లో గల పబ్లిక్ లైబ్రరీ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం, ఉత్తరాంధ్ర విద్యావంతుల వేదిక, సహాయత వెల్ఫేర్ సొసైటీ సంయుక్తంగా మొట్టమొదటి సారిగా ఎన్నికల బరిలో పోటీపడుతున్న అభ్యర్థులతో ముఖాముఖి

నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ ప్రక్రియ దేశంలోనే మొదటి సారి గా ఓపెన్ డిబేట్ కార్యక్రమం జరుగుతోందన్నారు.

 అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తో ప్రజలకు ముఖాముఖి నిర్వహించే సంప్రదాయం ఉందన్నారు. ఓటర్లకు అభ్యర్థులను నేరుగా ప్రశ్నించే అవకాశం ఇలాంటి వేదికల ద్వారా

లభిస్తుందన్నారు.

ఈ చర్చ కార్యక్రమం ఈ నెల 12 వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు విశాఖ పట్నం లోని ద్వారకా నగర్ లో గల పబ్లిక్ లైబ్రరీ లో నిర్వహిస్తున్నట్టు కిషోర్ కుమార్ తెలిపారు.  

ఈ కార్యక్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్న అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు సుమారు 38 మంది

పాల్గొనున్నారు. 

వారందరూ తమ మానిఫెస్టో ను వివరిస్తూ తమ కార్యాచరణ నూ ఈ చర్చా వేదిక పై నుంచి వివరించనున్నారు.
ఈకార్యక్రమంలో పాల్గొనే వలసింది గా నగర వాసులను ఆహ్వానిస్తున్నాం.

ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేసేందుకు పత్రికలు, టీవీ, వెబ్ మీడియా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం అన్నారు.



కార్యక్రమానికి మీడియా పార్టనర్ గా ప్రముఖ మీడియా ఏజెన్సీ DNS News Media సహకారం అందిస్తుందని తెలిపారు. 

ఈ సమావేశంలో డా. జ్ఞానానంద, వెంకటేష్, శ్రీధర్, వంశీ, అసిత, తదితరులు పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam