DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గతి తప్పిన మంత్రి ఉషశ్రీ చరణ్ ను బర్తరఫ్ చేయాలి:పాతర్ల రమేష్

*ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంపిణి వీడియో పై టీడీపీ మండిపాటు* 

DNS Report : P. Raja, Bureau Chief, అమరావతి    

అమరావతి, మార్చ్ 12, 2023 (డిఎన్ఎస్ ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు ఓటర్లను ప్రలోభం పెట్టె విధంగా సోషల్ మీడియా లో వీడియో లు వైరల్ అవుతున్న నేపథ్యంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ను బర్తరఫ్ చెయ్యాలని  తెలుగుదేశం పార్టీ

రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ డిమాండ్ చేసారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ దౌర్జన్యాలు చేసి అధికార పార్టీ ఎమ్మెల్సీలు గెలుస్తారా ? అని మండిపడ్డారు. విడుదలైన వీడియోలోని వాస్తవాలు విచారించాలన్నారు. ఎన్నికల్లో దోంగఓట్లు చేర్చే సంస్కృతి వైసీపీకి దక్కుతుందన్నారు,

రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు చేర్చి, డబ్బులు పంచి, ఎలాగైనా గెలవాలని వైసిపి చూస్తుందని ఆయన ఆరోపించారు,  చిత్తూరు జిల్లా అభివృద్ధిపై  ఎంపీ మిధున్ రెడ్డిని చర్చ కు రావాలని  నారా లోకేష్ 11వ తేదీన,చర్చకు రమ్మంటే, పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికల కోడ్ పేరుతో లోకేష్ ను జిల్లా నుండి బయటకు

పంపించారని ఆయన ఆరోపించారు, చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి జరిగిందని, వైసిపి హయాంలో అంతా  విద్వంశమేనని ఆయన విమర్శించారు. 
ఉత్తరాంధ్ర లో సైతం అధికార పార్టీ కి చెందిన కార్యకర్తలు నగదు పంచుతూ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలకు దొరికినా చర్యలు కనపడడం లేదన్నారు. 
అయితే ప్రస్తుతం జరుగుతున్నా

ఎన్నికలు విద్యావంతులకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధిని ఎన్నికోవాల్సి  ఉందన్నారు. పట్టభద్రులైన  ఓటర్లు విజ్ఞత తో ఓటింగ్ లో పాల్గొనాలన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam