DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెక్కలేని అతిక్రమణలు: హేమంత్

*ఎన్నిక రద్దు చేయాలనీ కలెక్టర్‌కు స్వతంత్ర అభ్యర్థి ఫిర్యాదు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

విశాఖపట్నం మార్చి 14, 2023 (డి ఎన్ ఎస్ ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెక్కలేని అతిక్రమణలు జరిగాయని, ఈ ఎన్నికను రద్దు చేయాలంటూ ఉత్తరాంధ్ర జిల్లాల స్వతంత్ర అభ్యర్థి సమయం హేమంతకుమార్‌ రిటానింగ్ అధికారి,

విశాఖ కలెక్టర్ డా. ఏ. మల్లిఖార్జున కు  ఫిర్యాదు చేశారు. సోమవారం నాటి ఎన్నికల్లో తాను అభ్యర్థినే అయినప్పటికీ అక్కయ్యపాలెం జీవీఎంసీ స్కూల్‌ వద్ద పోలీసులు, అధికారులు అతి చేసి లోనకు అనుమతించలేదని పేర్కొంటూ, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గారికి స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం సమావేశంలో

కలిసి ఫిర్యాదిచ్చారు. బ్యాలెట్‌ బాక్సుల తరలింపు సమయంలో అనుమతించక పోవడం పై మండిపడ్డారు. ఈ క్రమంలో అధికారులు అతి చేశారంటూ సమయం హేమంత్‌ ఫిర్యాదు చేసారు. 
ఈ ఎన్నికల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని, విచ్చల విడిగా సొమ్ము ఖర్చు చేశారని, నకలీ ఓట్లు వచ్చాయని, అర్హులైన వారి ఓట్లు గల్లంతయ్యాయని హేమంత్‌ ఆవేదన వ్యక్తం

చేశారు. నాలుగు గంటలకు గేట్లు వేసి లోపల ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయో పోలింగ్ అయిన ఓట్లతో కలిపి తెలియజేయవలసిన అధికారులు, నాలుగు గంటల వరకు పోలింగ్ అయిన సమాచారాన్ని మాత్రమే అది కూడా 6:30 కి ఇస్తూ, మిగిలిన టోకెన్లతో కూడిన ఓటింగ్ను రాత్రి 11:30 కి ఇవ్వడం వల్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీని మీద

విచారణ జరిపించాలన్నారు. 
తక్షణమే ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలి. జరిగిన పరిణామాలపై తాము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని ఓ ప్రకటనలో హేమంత్‌ తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam