DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వర్మ వ్యాఖ్యలపై హిందూ ఉపాధ్యాయ సమితి గవర్నర్ కి ఫిర్యాదు

DNS Report : P. Raja, Bureau Chief, అమరావతి    

అమరావతి, మార్చ్ 16, 2023 (డి ఎన్ ఎస్  DNS Online ): విశృంఖల సిని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల నాగార్జున విశ్వవిద్యాలయం లో మహిళలపై చేసిన అసభ్య, చేదు వ్యాఖ్యలపై హిందూ ఉపాధ్యాయ సమితి మండిపడింది. ఈ మేరకు హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షులు డేగల మహేష్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్

నజీర్ కు ఫిర్యాదు చేసారు. ఈ నెల 15 న నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వర్మను వర్సిటీ కి నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆహ్వానించారన్నారు. వచ్చిన వ్యక్తి విద్యార్థులకు మంచి మాటలు చెప్పాలి తప్ప మహిళ పట్ల మరియు యువతను చెడు మార్గంలో వెళ్లాలని విశ్వవిద్యాలయం

వేదికగా ప్రకటించడం జరిగిందన్నారు.  

ఇలాంటి దుర్ఘటనకు కారణమైన వర్మ పైన, అతను చేస్తున్న విశృంఖల ప్రసంగాన్ని ఆపనందుకు నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ కు ఉత్తరం ద్వారా, మెయిల్ ద్వారా  ఫిర్యాదు చెయ్యడం జరిగిందన్నారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam