DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ రాష్ట్రాన్ని ఆదుకోండి ప్రధాని మోదీ తో భేటీ లో సీఎం జగన్ వినతి 

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలపై ప్రధానితో సీఎం  45 నిమిషాల చర్చ*

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

( న్యూ ఢిల్లీ నుంచి రిపోర్టింగ్ )
 
*అమరావతి , మార్చ్ 17, 2023 (డి ఎన్ ఎస్ ):*  సమస్యల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తక్షణం ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్  రెడ్డి  భారత ప్రధానమంత్రి నరేంద్ర

మోడీని వేడుకున్నారు. శుక్రవారం దేశ రాజధాని న్యూ ఢిల్లీ లోని పార్లమెంటు లోని ప్రధాన మంత్రి కార్యాలయంలో సుమారు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని తో ముఖ్యమంత్రి.. ఛర్చించిన అంశాలను ఒక విజ్ఞాపన పత్రం రూపంలో కూడా అందించారు. 

*ప్రధాని నరంద్ర మోదీ తో సీఎం వై.ఎస్.

జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు:*

1.  రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్రానికి నెర వేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగు లోనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. వీటిపై వెంటనే దృష్టి సారించమని

కోరుతున్నాను. 

2.  గతంలో నేను ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించింది. కీలక అంశాలన్నీ ఇంకా పెండింగు లోనే ఉన్నాయన్న విషయాన్ని మీ దృష్టికి

తీసుకొస్తున్నానన్నారు. 

3.  2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ. 36,625 కోట్ల రూపాయలు పెండింగు లో ఉన్నాయి. రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ చేస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు

ఇవ్వాల్సిందిగా కోరారు.

4.  గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారు. ఈ ప్రభుత్వం తప్పు లేక పోయినప్పటికీ నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021–22 లో రూ. 42,472 కోట్ల రుణ పరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ. 17,923 కోట్లు

తగ్గించారు. కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారూ. 

5.  పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే

దిశగా ప్రాజెక్టు నిర్మాణాన్ని సాగిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయలో కేంద్రం ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్ది కాలం లోనే ఇది వాస్తవ రూపం లోకి వస్తుంది. ఫలితాలు ప్రజలకు అందుతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాను సొంతంగా సొంత ఖజానా నుంచి రూ. 2600.74 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. గడచిన రెండు

సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌ లో ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

6.  పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. వెంటనే దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నారు.

7.  తాగు నీటి సరఫరా అంశాన్ని కూడా పోలవరం

ప్రాజెక్టు లో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వారీగా నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

8.  పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగి పోతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకు

వస్తున్నాను. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని  నివారించ వచ్చు అన్నారు.. 

9.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌ గా రూ. 10 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. 

10.  తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కో కు రావాల్సిన బకాయిలు అలానే

ఉన్నాయి. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి రూ. 7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరారు. 

11.  జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించక పోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు

రాని, 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్‌ ఇస్తోంది. దాదాపు రూ. 5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ చేసిన విజ్ఞప్తి సరైనదే నని నీతి ఆయోగ్‌ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వినియోగించని రేషన్‌ కోటాను రాష్ట్రానికి

కేటాయించాల్సిందిగా కోరారు. 

12.  రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీని వల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమే కాకుండా, సేవా రంగం విస్తరిస్తుంది. స్వయం

శక్తి దిశగా రాష్ట్రం అడుగు లేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.  

13.  రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లా లుగా చేశాం. ప్రతి జిల్లాకు సుమారుగా 18 లక్షల మంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరు చేసిన మూడు మెడికల్‌ కాలేజీ లతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12

కాలేజీ లకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నాను. ఈ కాలేజీ లకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయ పడాలని విజ్ఞప్తి చేసారు.  

14.  వైయస్సార్‌ కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ

ఇచ్చింది. ఈ ప్లాంట్‌ నిలదొక్కు కోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీ ఎండీసీ కి గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేసారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam