DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విమాన ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, మార్చి 18, 2023 (డిఎన్ఎస్ ):*విశాఖ అంతర్జాతీయ విమానా శ్రయం నుంచి ప్రయాణించే ప్రయాణికులకు  మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని  సలహా మండలి చైర్మన్ విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ఆదేశించారు. శనివారం విమానాశ్రయం టెర్మినల్ భవన్లో

జరిగిన  సలహా మండలి  సమావేశానికి ఎంవివి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. తొలుత విమానాశ్రయం డైరెక్టర్  కె శ్రీనివాసరావు ఎజెండాలో అంశాలను సభ్యులకు వివరించారు. నూతన బడ్జెట్ ప్రతి పాదనలు  తెలిపారు. వీటికి సంబంధించి సభ్యుల నుంచి తగిన సలహాలు సూచనలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భముగా పలువురు సభ్యులు అనేక

 ప్రతిపాదనలు చేశారు. అయితే వీటిపై సాధ్యాసాధ్యాలపై చర్చించిన తర్వాత ఏవైతే తక్షణమే అమలు చేయగలమన్నది నిర్ణయించి వాటినే తీర్మానించి కేంద్ర రాష్ట్రాలకు పంపించాలని ఛైర్మెన్ ఎంవీవీ నిర్ణయించారు.  
భారతదేశంలో 9 వ రిచెస్ట్ సిటీగా ఉన్న విశాఖ ఇతర విమానాశ్రయాలతో పోల్చుకుంటే 19వ స్థానంలో ఉందనీ , దీనినీ తొమ్మిదో

స్థానంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్క సభ్యుడు ప్రయత్నించాలని సలహా మండలి ప్రత్యేక సలహా దారు ఓరుగంటి నరేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 
అనంతరం ఛైర్మెన్ ఎంవీవీ సత్యనారాయణ కొన్ని ముఖ్య తీర్మానాలను ప్రతి పాదించారు. ప్రయాణికులకు మరింత  మెరుగైన సదుపాయాలు కల్పించాలని, గంటకు 10 స్లాట్లు కేటాయించాలని, గతంలో విశాఖ

నుంచి దుబాయ్ వరకు నడిచే ఎయిర్ ఇండియా విమానం చాలా కాలం నుంచి నిలిచిపోయినందున ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ కాబట్టి దుబాయ్, మలేషియా బ్యాంకాక్ లకు కొత్త సర్వీసులు నడిపే విధంగా పలు విమాన యాన సంస్థలను కోరాలని నిర్ణయించారు. 
దీనిపై డైరెక్టర్ శ్రీనివాస రావు వివరిస్తూ  కౌలా లంపూర్ కి నూతన సర్వీస్

నడిపేందుకు మలిండో సంస్ధ ముందుకు వచ్చిందన్నారు.. మిగిలిన ప్రాంతాలకి ఇండిగో, ఏయిర్ ఏసియా, ఇతర సంస్థలను సంప్రదిస్తున్నామన్నారు. వారణాసికి నూతన సర్వీస్ అవసరము అని కాబట్టి అన్నిటికీ అవసరమైన సహకారం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహాకారం కోసం సలహా మండలి తరఫున తీర్మానాలు చేసి పంపాలని ఎంపి ఎంవీవీ సూచించారు.. అంతే కాకుండ

కార్గో రవాణా తగ్గిపోయిందని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని సభ్యులు ఛైర్మెన్,డైరెక్టర్ ల దృష్టి కి తీసుకు వచ్చారు. 
రాష్ట్ర ప్రభుత్వము త్వరలోనే అన్ని విమానయాన సంస్థలతో ప్రత్యేక సమావేశం యేర్పాటు చేసి మరింత కనెక్టివిటీ పెంచాలని, విమానాశ్రయాలు మరింత గా అభివృద్ది చేసే ప్రయత్నాలు చేస్తోందని సలహా మండలి సభ్యులు

గంట్ల శ్రీను బాబు తెలిపారు.. ఐతే ఈలోగా ముఖ్య పనులు వేగవంతం చేయాలని ఛైర్మెన్ డైరెక్టర్ శ్రీనివాస రావును కొరారు.. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం లోపల కొన్ని మార్పులు చేర్పులు చెయ్యాలని ఛైర్మెన్ ఎంవీవీ సత్యనారాయణ ఆదేశించారు.

అదే విధంగా మరుగు దొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని

కోరారు..సమావేశములో సభ్యులు ఛైర్మెన్ ఎంవీవీ సత్యనారాయణ తో పాటు పదోన్నతి పై బదిలీ కానున్న డైరక్టర్ శ్రీని వాస్ రావు ను ఘణము గా సత్కరించారు.
సలహామండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, బి. రవీంద్ర నాయుడు, కరణం రెడ్డి నర్సింగరావు,సిరట్ల శ్రీని వాస్, అంబటి శైలేష్, కిరీటి, వివిధ విభాగాల నుంచి అధికారులు పాల్గొన్నారు..

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam