DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిల్లల్ని కొట్టిన టీచర్లు, పోలీసులపై న్యాయ విచారణ చెయ్యాలి: టీడీపీ

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, మార్చ్ 19, 2023 (DNS Online ):* జంగారెడ్డి గూడెం లోని ఓ పాఠశాల లో టీచర్లు, పిల్లలను కొట్టి, పోలీస్ స్టేషన్ కు అప్పగించడం పై న్యాయ విచారణ చెయ్యాలని  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్  విమర్శించారు, ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏలూరు జిల్లా

జంగారెడ్డిగూడెం లోని ఒక పాఠశాలలో క్లాస్ రూమ్ లో ఫ్యాన్ తిరగటం లేదని 9 వ తరగతి విద్యార్థులు అనడమే మహాపాపంగా పరిణమించి పొలిసు లాకప్ వరకూ వెళ్లేలా చేసిందన్నారు. ఈ విద్యార్థులను దండించిన పాఠశాల టీచర్లు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. వివరాల్లోకి వెళితే. .. జంగారెడ్డిగూడెంలో పాఠశాలలో ఫ్యాన్

 చెడిపోయిందని, ఫ్యాన్ ను  బయట పడేయమని విద్యార్థులు అనడంతో ఉపాధ్యాయులు ఆ పిల్లలను కొట్టి పోలీసులకు అప్పగించడం చర్య అని ఆయన మండిపడ్డారు. గురువులను మేము గౌరవిస్తాము కానీ ఉపాధ్యాయులు ఈ విధంగా చెయ్యడం సరికాదన్నారు. 
విద్యార్థులు తరగతి గదిలో ఫ్యాన్ పోయిందని అని అన్న చిన్న మాటకే పిల్లలను కొట్టిన ఉపాధ్యాయులను

పోలీసు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారిని విధులు నుండి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు, 
విద్యార్థులు చెప్పిన ఫ్యాన్ తరగతి గదిలోది మాత్రమేనని, అయితే టీచర్లకు అర్ధమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పనిచేయలేదని అనిపించిందన్నారు.  దీనిపై న్యాయ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam