DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మెట్రో డిపిఆర్ కేంద్రానికి పంపకపోవడం నిర్లక్ష్యం కాదా?: టిడిపి

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, మార్చ్ 21, 2023 (డిఎన్ఎస్  DNS Online ):*  విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి ప్రతిపాదనలు కేంద్రానికి పంపకపోవడం వైకాపా ప్రభుత్వం విశాఖ ప్రజల పట్ల చేసిన నిర్లక్ష్యం  కాదా అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ విమర్శించారు. అమరావతి లో మంగళవారం ఆయన డి ఎన్

ఎస్ మీడియా తో మాట్లాడుతూ, విశాఖ ను రాజధాని చేస్తాం అన్నారు, కనీసం కేంద్రం కేటాయించిన మెట్రో రైలు కి డిపిఆర్ పంపలేకపోయారన్నారు. నేటి వరకూ దీని డిపిఆర్ ప్రతిపాదనలు కేంద్రానికి అందలేదని, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్థీప్ పూరి పార్లమెంట్లో ప్రకటించడంతో, జగన్ ప్రభుత్వం కు విశాఖ పట్ల ఉన్న

నిర్లక్ష్యం తెలుస్తోందన్నారు. 

విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు  లేదని తేల్చి చెప్పారన్నారు. 2017లో అనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ మెట్రో రైలు అవసరాన్ని గుర్తించి, దానికి ప్రతిపాదన పంపారని ఆయన గుర్తు చేశారు. అయితే, వైసిపి ప్రభుత్వం విశాఖ

మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో చొరవ చూపలేదని ఆయన ఆరోపించారు.  2017 సవరించిన మెట్రో రైల్ విధానము ప్రకారం మెట్రో రైల్ ప్రతిపాదనను మళ్లీ సమర్పించాలని భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ నేటి వరకు ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదని కేంద్రం ప్రకటించిందన్నారు. 

పార్లమెంట్లో కేంద్ర మంత్రి

సమాధానం పై విశాఖకు ఎంతో అవసరమైన మెట్రో రైల్ ప్రాజెక్ట్ రాకపోవడానికి వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఆయన విమర్శించారు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కొత్త ప్రతిపాదనలు రూపొందించి పంపమని కేంద్రం అడిగిన ఇంతవరకు పంపకపోవడం దుర్మార్గమని ఆయన అన్నారు, ప్రజల అవసరాలను  గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం

వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు, మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం  మొట్టమొదటిగా విజయవాడలో ఉన్న అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ను, విశాఖకు తరలించాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆయన తెలిపారు, విశాఖలో విఎమ్ఆర్టిఏ భవన్లో మెట్రో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్న తరుణంలో

పార్లమెంట్లో కేంద్ర మంత్రి విశాఖ మెట్రో రైల్ ప్రతిపాదనలు కేంద్రం వద్ద లేవని  ప్రకటించడంతో  వైసిపి ప్రభుత్వం విశాఖ మెట్రో  రైలు ప్రాజెక్టుపై చొరవ తీసుకోలేదని ప్రజలకు అర్థం అయిపోయిందని ఆయన విమర్శించారు, ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని 2017లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

నాయుడు విశాఖ, విజయవాడలకు మెట్రోరైలు  అవసరాన్ని  గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని ఆయన తెలిపారు, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లి అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన  రాష్ట్ర ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు,

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam