DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీ ఓటర్లు కాదా? వైకాపాకు టీడీపీ సూటి ప్రశ్న

*ఎమ్మెల్సీ ఎన్నికలో అనురాధ గెలుపు పై టీడీపీ తమ్ముళ్లు సంబరాలు*

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, మార్చ్ 23, 2023 (డిఎన్ఎస్  DNS Online ):* మీ పార్టీ ఎమ్మెల్యే లు కూడా మీ ఓటర్లు కాదా అంటూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ వైకాపా సలహాదారును ప్రశ్నించారు. గురువారం ఎం ఎల్ ఏ విభాగం లో ఎం ఎల్ సి

ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఘానా విజయం సాధించడం పట్ల తెలుగుదేశం సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా అమరావతిలో రమేష్ గురువారం డీఎన్ఎస్ తో  మాట్లాడుతూ, గత వరం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైతే  వీళ్ళు ఓటర్లు మావాళ్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు అంటూ అధికార పార్టీ సలహాదారు చేసిన

ప్రకటనను గుర్తు చేసారు.   

రాష్ట్రానికి చంద్రబాబు పాలన అవసరమని రాష్ట్ర ప్రజలంతా గుర్తించి పట్టుబద్రుల ఎన్నికల్లో గాని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించినందుకు అందరికీ అభినందనలు  తెలుపుతున్నట్టు, తెలిపారు. బీసీ మహిళ అనురాధ విజయం ప్రజాస్వామ్యాన్ని గెలిచిందని, రాబోయే

రోజుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ఆయన అన్నారు, పులివెందులలో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని,   జగన్ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు, వచ్చే ఎన్నికల్లో కూడా వైసిపికి ప్రజలు ఈ విధంగానే గుణపాఠం చెబుతారని ఆయన జోస్యం చెప్పారు, పంచుమర్తి అనురాధ గెలుపు బలహీన

వర్గాల అభివృద్ధికి ములుపు అని ఆయన అన్నారు, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు బలోపేతం చేస్తున్నారనే సంకేతం ఈ ఎన్నికలలో  ఎమ్మెల్సీ విజయం ద్వారా మరోసారి మరోసారి రాష్ట్ర ప్రజలకు స్పష్టమైందని ఆయన తెలిపారు, రాష్ట్రానికి  చంద్రబాబు పాలనే అవసరమని వైసిపి నేతలు గుర్తించారని ఆయన అన్నారు, ఆత్మ ప్రబోధానందను ఆత్మ ప్రబోధాను

సారం ఓటేసిన వారందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు, రాష్ట్రంలో పట్టుబద్రులు వైసీపీని వ్యతిరేకించారని, ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. ఎపిలో జగన్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు, కొందరు వైసిపి నేతలు చంద్రబాబును

విమర్శించటం దుర్మార్గమైన చర్య అన్నారు, రాష్ట్రంలో చంద్రబాబు ఎవరిని మోసం చేయలేదని ఆయన తెలిపారు, చంద్రబాబు విమర్శించే స్థాయి మంత్రి జోగి రమేష్ కి లేదని ఆయన అన్నారు, చంద్రబాబు స్థాయిని మరచి జోగి రమేష్ మాట్లాడుతున్నాడన్నారు. ని ఇలాంటి విమర్శలు చేయడం  మానుకోకపోతే రాష్ట్ర ప్రజలు జోగి రమేష్ ను తరిమితమే కొట్టే రోజులు

వస్తాయని ఆయన హెచ్చరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam