DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే రాజధాని పేరిట కొత్త కథ

*చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు సిగ్గుచేటు: పాతర్ల రమేష్ మండిపాటు* 

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, మార్చ్ 24, 2023 (డిఎన్ఎస్  DNS Online ):*  ఏపీలో ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే రాజధాని నిర్మాణం పేరుతో వైసిపి కొత్త కథ సృష్టించారని, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ ఆరోపించారు.

శుక్రవారం సాయంత్రం ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భస్టు పట్టించారని ఆయన ఆరోపించారు, ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారని మంత్రి గుడివాడ అమర్ నాధ్ ఆరోపించడాన్నీ ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పై అసత్య ప్రచారం  మంత్రి గుడివాడ అమర్నాథ్ కు చేస్తూ ఉన్నారని ఆయన విమర్శించారు.

మంత్రి అమర్నాథ్ కు దమ్ముంటే ఈ విషయం పై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు, రాష్ట్రంలో సంపదను సృష్టించి అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు చంద్రబాబే  అని, చంద్రబాబుపై లేనిపోని ఆరోపణ చేయడం వైసిపి నాయకులు మానుకోవాలని ఆయన కోరారు. 
అమరావతి లో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు చంద్రబాబు నాయుడు  హయాంలో నిర్మాణాలు

చేస్తే, వాటిపై ఇప్పుడు కావాలని వైసిపి తప్పుడు ఆరోపణలు చేయడం  సిగ్గుచేటు అన్నారు. అసెంబ్లీ సచివాలయం హైకోర్టు నిర్మాణాలు వైసీపీ నేతలు కళ్ళు కనిపించడం లేదా ? అని ఆయన ప్రశ్నించారు, చంద్రబాబుపై ఎన్ని అవినీతి ఆరోపణ చేసినా చివరికి  తుస్సుమంటుందని ఆయన తెలిపారు, చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు తప్పు

చేయలేదని, ఆయన తెలిపారు, చంద్రబాబు పై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం, వైసిపి నాయకులకు  మానుకోవాలని ఆయన తెలిపారు చంద్రబాబు నిప్పులాంటి వాడని ఆయనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం వైసిపి మంత్రులకు తగదని ఆయన తెలిపారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam